కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి.. ఇళ్లలోకి భారీగా నీరు
By తోట వంశీ కుమార్ Published on 30 Jun 2020 8:08 AM GMT
కొండపోచమ్మ సాగర్ నుండి యాదాద్రి జిల్లాకు నీటిని పంపే కుడికాలువకు మర్కుక్ మండలం శివారు వెంకటాపురం వద్ద గండి పడింది. దీంతో వెంకటాపురం గ్రామంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. పలువురి ఇళ్లల్లోకి నీళ్లు ప్రవేశించాయి. జగదేవ్పూర్, ఆలేరు నియోజకవర్గాల్లోని ఎం. తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని చెరువులు నింపేందుకు కొండపోచమ్మ సాగర్ నీటిని విడుదల చేశారు.
Next Story