చారిత్ర‌క‌ 'పింక్‌బాల్' పోరులో కోహ్లీ అద్భుత‌ సెంచ‌రీ..!

By Medi Samrat  Published on  23 Nov 2019 9:17 AM GMT
చారిత్ర‌క‌ పింక్‌బాల్ పోరులో కోహ్లీ అద్భుత‌ సెంచ‌రీ..!

ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచ‌రీ చేశాడు. త‌యిజుల్ ఇస్లామ్ వేసిన 67వ‌ ఓవ‌ర్ నాలుగో బంతికి డ‌బుల్ తీసి కెరీర్ లో 27వ సెంచ‌రీ పూర్తీ చేశాడు. కోహ్లీ ఈ సెంచ‌రీకి 158 బంతులు తీసుకున్నాడు. అంత‌కుముందు.. హాఫ్ సెంచరీతో మంచి జోరుమీద కనిపించిన రహానే(51).. జట్టు స్కోర్ 236 పరుగుల దగ్గర అవుట్ అయ్యాడు. తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో హుస్సేన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో కోహ్లీ, రహానే జోడికి బ్రేక్ పడింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ, జడేజా ఉన్నారు. ప్ర‌స్తుతం టీమిండియా 276/4 తో భారీ స్కోరు దిశ‌గా ప‌య‌నిస్తుంది.

Next Story