ఈ నెల 29న 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' రిలీజ్‌

By అంజి  Published on  23 Nov 2019 11:02 AM GMT
ఈ నెల 29న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు రిలీజ్‌

రాంగోపాల్ వర్మ తన టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై అందిస్తున్న తాజా సంచలన చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. సిద్దార్థ తాతోలు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియచేస్తూ....800 థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నామని తెలిపింది. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్స్ కు, సాంగ్స్ కు, విశేషమైన ఆదరణ లభించిందని తెలిపింది. అలాగే 'పప్పు లాంటి అబ్బాయి' పాట కూడా అశేష ప్రేక్షక వాహిని ఆదరణతో ట్రెండింగ్ అయ్యిందని చిత్రబృందం వెల్లడించింది.

ఏ వర్గాలను టార్గెట్ చేసి ఈ చిత్రం తీయలేదని...ప్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపద్యాలలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిదని స్ప్రష్టం చేసింది. ఇందులోని ఏడు పాటలు ఏ పాటకు ఆ పాట హైలైట్ గా ఉంటుందని వివరించింది. టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, నిర్మాతలు: అజయ్ మైసూర్, టి. న‌రేష్‌కుమార్‌, టి. శ్రీ‌ధర్.

Next Story