బుమ్రాకు పాలీ ఉమిగ్రర్ అవార్డు
By Newsmeter.Network
అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న టీంఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సరైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్ అవార్డుకు బుమ్రా ఎంపికయ్యాడు. 2018-19 సీజన్లో అద్భుత ప్రదర్శనకుగాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతడికి ఈ అవార్డు ప్రకటించింది. దీంతో పురుషుల విభాగంలో ప్రతి ఏటా ఇచ్చే అత్యున్నత పురస్కారం అతడికి దక్కింది. ఈ అవార్డు కింద ట్రోఫీతో పాటు రూ. 15 లక్షల నగదు బహుమతి అందించారు.
మహిళల విభాగంలో దేశ అత్యున్నత క్రికెట్ పురస్కారం పూనమ్ యాదవ్ను వరించింది. దీంతో పాటు ఆమెకు ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డు కూడా దక్కింది. మాజీ క్రికెటర్లు కృష్ణమాచారి శ్రీకాంత్, అంజుమ్ చోప్రాలకు కర్నల్ సీకే నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. టీమ్ఇండియా తరఫున ఓపెనర్ మయాంక్ అగర్వాల్కు ఉత్తమ అరంగేట్ర ఆటగాడి అవార్డు దక్కగా.. మహిళల విభాగంలో ఇది 15 ఏండ్ల షఫాలీ వర్మను వరించింది. రంజీ ట్రోఫీలో అదరగొట్టిన ఆల్రౌండర్ శివం దూబేకు లాలా అమర్నాథ్ అవార్డు లభించింది.