విశాఖ గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌పై స్పందించిన సీఎం జ‌గ‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 May 2020 2:31 AM GMT
విశాఖ గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌పై స్పందించిన సీఎం జ‌గ‌న్

విశాఖ న‌గ‌రంలోని గోపాల‌ప‌ట్నం ప‌రిధి ఆర్‌.ఆర్ వెంక‌టాపురంలోని ఎల్‌.జి పాలిమ‌ర్స్ ప‌రిశ్ర‌మ నుంచి తెల్ల‌వారు జామున ర‌సాయ‌న వాయువు లీక్ కావ‌డంతో ముగ్గురు మృతి చెంద‌గా.. 200 మందికి పైగా అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. ఈ వాయువు గాల్లోకి వ్యాపిస్తుండ‌డంతో.. ప‌రిస‌ర గ్రామాల ప్ర‌జ‌ల‌ను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి స్పందించారు. స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

Next Story