జగన్ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Oct 2019 2:36 PM GMT
జగన్ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ఏపీ సీఎం జగన్ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. జగన్‌ పిటిషన్‌పై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్య‌క్తం చేసింది. వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ కౌంటర్ పిటీష‌న్‌లో పేర్కొంది. వాస్తవాలను దాచిపెట్టి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని.. జగన్‌ జైళ్లో ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేశారని సీబీఐ కౌంట‌ర్‌లో పేర్కొంది.

అలాగే.. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్‌ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న సీబీఐ.. ఏపీలో రెవెన్యూ లోటనేది వ్యక్తిగత హాజరుకు మినహాయింపు నిచ్చే కారణం కాదని సీబీఐ కౌంట‌ర్‌లో పేర్కొంది. విజయవాడ నుంచి వారానికోసారి రావడం కష్టం కాదని కూడా సీబీఐ కౌంటర్ లో పేర్కొంది. సీబీఐ కౌంటర్ పై కోర్టు శుక్రవారం వాదనలు విననుంది.

Next Story