ఖమేనీ హతం.. ఇరాన్‌ ధ్రువీకరణ.. 40 రోజుల పాటు సంతాప దినాల ప్రకటన

ఇజ్రాయెల్‌ - అమెరికా దాడుల్లో సుప్రీం లీడర్‌ ఖమేనీ హతమైనట్టు ఇరాన్‌ అధికారిక మీడియా ఆదివారం నాడు ధ్రువీకరించింది.

By -  అంజి
Published on : 1 March 2026 7:42 AM IST

US-Israel Attacks Iran, Iran confirms Khamenei killed, US-Israel strikes, declares 40-day mourning

ఖమేనీ హతం.. ఇరాన్‌ ధ్రువీకరణ.. 40 రోజుల పాటు సంతాప దినాల ప్రకటన

ఇజ్రాయెల్‌ - అమెరికా దాడుల్లో సుప్రీం లీడర్‌ ఖమేనీ హతమైనట్టు ఇరాన్‌ అధికారిక మీడియా ఆదివారం నాడు ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఆయనతో పాటు కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు కూడా మరణించినట్టు వెల్లడించింది.

ఇస్లామిక్ రిపబ్లిక్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన కార్యాలయంలో మరణించారని ఇరాన్ రాష్ట్ర మీడియా ధృవీకరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖమేనీ మరణాన్ని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ ధృవీకరణ వచ్చింది. ఖమేనీ మరణం తరువాత ఇరాన్‌లో 40 రోజుల ప్రజా సంతాప దినాలు ప్రకటించాయని ఆ రాష్ట్ర మీడియా తెలిపింది.

అలీ ఖమేనీ గురించి..

ఇరాన్‌ను 36 ఏళ్లు తన ఉక్కు పిడికిలిలో పాలించిన నియంత అలీ ఖమేనీ. 1939లో ఇరాన్‌లోని మహషద్‌లో ఓ పేద కుటుంబంలో ఖమేనీ జన్మించారు. ఇస్లామిక్‌ తిరుగుబాటు నాయకుడు ఖొమైనీకి శిష్యుడిగా మారి ఇరాన్‌ షా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ఖమేనీ ముఖ్యపాత్ర పోషించారు. తన గురువు ఖొమైనీ నాయకత్వంలో 1979లో ఇరాన్‌లో ఇస్లామిక్‌ రూల్‌ స్థాపించగలిగారు. 1980 - 88 మధ్య ఇరాక్‌తో ఎనిమిదేళ్లు యుద్ధం సాగినా ఇరాన్‌ పట్టును సడలనివ్వలేదు.

1989లో ఇరాన్‌ తొలి సుప్రీంలీడర్‌ అయతొల్లా రుహుల్లా ఖొమైనీ చనిపోయాక ఖమేనీ పగ్గాలు అందుకున్నారు. సుప్రీంలీడర్‌ హోదా కోసం రాజ్యాంగాన్ని మార్పించారు. యూఎస్‌ సహా విదేశాల ఆంక్షలు, ఒత్తిళ్లు కొనసాగినా పట్టువీడలేదు. నిరసనలు చెలరేగితే నిర్దాక్షిణ్యంగా వాటిని అణచివేసేవారు. హెజ్బొల్లా, హౌతీ వంటి మిలిటెంట్‌ సంస్థలను పోషించి మిడిల్‌ ఈస్ట్‌ను శాసించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఖమేనీ తర్వాత ఎవరు అనేది చర్చనీయాంశమైంది.

Next Story