చర్చిలో కాల్పుల కలకలం.. ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు మృతి

Three kids among 5 killed in mass shooting inside church in Sacramento. అమెరికా దేశంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో గల చర్చిలో సోమవారం

By అంజి
Published on : 1 March 2022 11:13 AM IST

చర్చిలో కాల్పుల కలకలం.. ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు మృతి

అమెరికా దేశంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో గల చర్చిలో సోమవారం సాయంత్రం ఓ ముష్కరుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు మరణించారని బీఎన్‌వో న్యూస్ తెలిపింది. చంపబడిన పిల్లలు ముష్కరుడి సొంత పిల్లలు. ముగ్గురూ 15 ఏళ్లలోపు వారే. నలుగురిపై కాల్పులు జరిపి చంపిన తర్వాత, అనుమానితుడు తనపై తుపాకీని తిప్పుకుని కాల్చుకున్నాడని శాక్రమెంటో కౌంటీ షెరీఫ్ ప్రతినిధి సార్జంట్ రాడ్ గ్రాస్‌మన్ మీడియా ప్రతినిధులతో అన్నారు. నాల్గవ బాధితుడి గుర్తింపు వెంటనే స్పష్టంగా తెలియరాలేదు.

నగరంలోని ఆర్డెన్-ఆర్కేడ్ ప్రాంతంలోని వైడా వేలో ఉన్న చర్చి ఆవరణలో ఈ ఘటన జరిగింది. కాలిఫోర్నియా స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 5:07 గంటలకు కాల్పులు జరుగుతున్నట్లు చర్చిలోని ఒక కార్మికుడు మొదట విన్నాడు. వెంటనే భవనం నుంచి బయటకు వెళ్లి పోలీసులకు సమాచారం అందించాడు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కాల్పులు "గృహ హింస"-సంబంధిత సంఘటనగా తాము దర్యాప్తు చేస్తున్నామని షెరీఫ్ కార్యాలయం తెలిపింది.

Next Story