పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి

కాబూల్: పాకిస్థాన్ సైన్యం నిర్వహించిన వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ దేశీయ క్రికెట్ క్రీడాకారులు మృతి చెందారు.

By -  Knakam Karthik
Published on : 18 Oct 2025 8:40 AM IST

Interantional News, Pakistani airstrike, Afghan cricketers killed

పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి

కాబూల్: పాకిస్థాన్ సైన్యం నిర్వహించిన వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ దేశీయ క్రికెట్ క్రీడాకారులు మృతి చెందారు. ఈ ఘటన పాక్టికా ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. ఈ దాడి నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) పాకిస్థాన్, శ్రీలంకలతో జరగాల్సిన ముక్కోణపు టి20 సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.

ACB విడుదల చేసిన ప్రకటనలో, మృతి చెందిన ఆటగాళ్లను కబీర్, సిబ్గతుల్లా, హరూన్గా గుర్తించింది. అదనంగా మరో ఐదుగురు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.వివరాల ప్రకారం, ఈ ముగ్గురు ఆటగాళ్లు ఉర్గున్ ప్రాంతం నుంచి పాక్టికా రాజధాని శరణాకు వచ్చి, వచ్చే నెలలో జరగాల్సిన ముక్కోణపు సిరీస్‌కు సన్నద్ధమవుతున్నారు. ఉర్గున్‌కు తిరిగి వెళ్లిన తర్వాత జరిగిన ఒక సమావేశంలో వీరిపై పాకిస్థాన్ సైన్యం వైమానిక దాడి జరిపిందని బోర్డు వెల్లడించింది. “పాకిస్థాన్ పాలకులచే నిర్వహించబడిన ఈ పిరికిపంద దాడిలో నిరపరాధ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు,” అని ACB తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలను బోర్డు వెల్లడించలేదు. దీంతో, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు పాకిస్థాన్, శ్రీలంకలతో జరగాల్సిన సిరీస్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకుంది.

Next Story