పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌కు ఫీల్డ్‌ మార్షల్‌ పదోన్నతి

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు పాకిస్తాన్‌ ప్రభుత్వం మంగళవారం (మే 20, 2025) ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి కల్పించింది.

By అంజి
Published on : 21 May 2025 7:52 AM IST

Pakistan government, Army Chief, General Asim Munir , Field Marshal

పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌కు ఫీల్డ్‌ మార్షల్‌ పదోన్నతి 

భారతదేశంతో ఇటీవలి జరిగిన యుద్ధంలో సాయుధ దళాలను "విజయవంతంగా" నడిపించినందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు పాకిస్తాన్‌ ప్రభుత్వం మంగళవారం (మే 20, 2025) ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి కల్పించింది. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వ టీవీ నివేదించింది. దాదాపు 60 ఏళ్లలో ఒక జనరల్‌ను ఈ పాత్రకు నియమించడం ఇదే మొదటిసారి. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. "జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని, శత్రువును నిర్ణయాత్మకంగా ఓడించిన వ్యూహాత్మక ప్రతిభ, ధైర్య నాయకత్వానికి గుర్తింపుగా ఇది వచ్చింది" అని ప్రధాన మంత్రి షరీఫ్ తన కార్యాలయం నుండి రాయిటర్స్‌కు ఒక ప్రకటనలో తెలిపారు.

ఫీల్డ్ మార్షల్ అనేది ఒక ఫైవ్‌ స్టార్‌ ర్యాంక్ అని, ఇది సాధారణంగా అసాధారణ నాయకత్వం, యుద్ధకాల విజయాన్ని సూచిస్తుందని ఒక భద్రతా అధికారి తెలిపారు. "పాకిస్తాన్ నియంత జనరల్ అయూబ్ ఖాన్ 1965లో తనను తాను ఫీల్డ్ మార్షల్‌గా చేసుకున్న తర్వాత ఇది మొదటి పదోన్నతి" అని ఆయన అన్నారు. కొత్త సెరిమోనియల్ ర్యాంక్‌తో, "మిస్టర్ మునీర్ ఆర్మీ చీఫ్‌గా కొనసాగుతారు" అని ఆయన అన్నారు.

"జనరల్ అసిమ్ మునీర్‌ను దేశ ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి కల్పించడానికి" మంత్రివర్గం ముఖ్యమైన నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ యాజమాన్యంలోని పీటీవీ నివేదించింది. భారతదేశంతో జరిగిన వివాదంలో ఆయన పోషించిన "ఆదర్శప్రాయమైన పాత్ర" కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అది తెలిపింది. పాకిస్తాన్ వైమానిక దళ అధిపతి ఎయిర్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ పదవీకాలం ముగిసిన తర్వాత ఆయన సేవను పొడిగించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించిందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

Next Story