నిమిషా ప్రియ మరణశిక్ష రద్దు వాదనలను ఖండించిన భారత ప్రభుత్వం

కేరళ నర్సు నిమిషా ప్రియ మరణశిక్షను యెమెన్ అధికారులు పూర్తిగా రద్దు చేశారని భారత గ్రాండ్ ముఫ్తీ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

By అంజి
Published on : 29 July 2025 6:44 AM IST

Nimisha Priya, death sentence cancelled, Yemen, Grand Muftis office

BREAKING: నిమిషా ప్రియ మరణశిక్ష రద్దు

2017లో యెమెన్‌లో జరిగిన హత్య కేసులో దోషిగా తేలిన కేరళ నర్సు నిమిషా ప్రియ మరణశిక్షను రద్దు చేశారనే వాదనలను విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం తోసిపుచ్చిందని వర్గాలు తెలిపాయి. "నిమిషా ప్రియ కేసుపై కొంతమంది వ్యక్తులు పంచుకుంటున్న సమాచారం తప్పు" అని MEA వర్గాలు తెలిపాయి.

అయితే కేరళ నర్సు నిమిషా ప్రియ మరణశిక్షను యెమెన్ అధికారులు పూర్తిగా రద్దు చేశారని భారత గ్రాండ్ ముఫ్తీ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. "గతంలో సస్పెండ్ చేయబడిన నిమిషా ప్రియ మరణశిక్షను రద్దు చేశారు" అని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. "సన్నాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తాత్కాలికంగా సస్పెండ్ చేయబడిన మరణశిక్షను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు" అని ముస్లియార్ కార్యాలయం తెలిపింది. అయితే, యెమెన్ ప్రభుత్వం నుండి అధికారిక వ్రాతపూర్వక ధృవీకరణ ఇంకా అందలేదని గ్రాండ్ ముఫ్తీ కార్యాలయం పేర్కొంది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ డెవలప్‌మెంట్‌ని ఇంకా ధృవీకరించలేదు. ఆమె ఉరిశిక్ష జూలై 16న జరగాల్సి ఉంది, కానీ గ్రాండ్ ముఫ్తీ ఎపి అబూబక్కర్ ముస్లయ్యర్ యెమెన్ అధికారులను పునఃపరిశీలించాలని అభ్యర్థించడంతో ఒక రోజు ముందు తాత్కాలికంగా నిలిపివేయబడింది.

కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల నర్సు నిమిషా ప్రియ 2008లో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం యెమెన్‌కు వెళ్లింది. ఒక క్రైస్తవ కుటుంబానికి చెందిన ఆమె తరువాత యెమెన్ జాతీయుడు తలాల్ అబ్దో మహదీతో వ్యాపార భాగస్వామ్యంలోకి ప్రవేశించింది. ఇద్దరూ రాజధాని సనాలో ఒక క్లినిక్‌ను ప్రారంభించారు. మహది ఆమెను వేధించడం మొదలుపెట్టి, ఆమె భర్త అని బహిరంగంగా చెప్పుకున్న తర్వాత వారి సంబంధం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఆమె పాస్‌పోర్ట్‌ను కూడా అతను జప్తు చేసి, ఆమె కదలికలను, భారతదేశానికి తిరిగి వచ్చే సామర్థ్యాన్ని పరిమితం చేశాడని ఆరోపించారు.

యెమెన్ అధికారుల ప్రకారం, ప్రియా 2017లో మహదీకి మత్తుమందు ఇచ్చి తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందడానికి ప్రయత్నించింది. అతను అనుమానాస్పదంగా డ్రగ్ అధిక మోతాదు కారణంగా మరణించడంతో ఈ సంఘటన ప్రాణాంతకంగా మారింది. ఆమెను 2018లో అరెస్టు చేసి, విచారించి, హత్య కేసులో దోషిగా నిర్ధారించారు.

నిమిషా కేసు చాలా సంవత్సరాలుగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. 2020లో యెమెన్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్-అలీమి డిసెంబర్ 2024లో ఆమె ఉరిశిక్షను ఆమోదించిన తర్వాత గత కొన్ని నెలలుగా ఆమెను కాపాడే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. హౌతీ నాయకుడు మహదీ అల్-మషత్ జనవరి 2025లో దీనికి ఆమోదం తెలిపినప్పుడు ఈ విషయం మరింత తీవ్రమైంది. అయితే, భారత ప్రభుత్వం "సమిష్టి ప్రయత్నాల" కారణంగా ఆమె ఉరిశిక్ష వాయిదా పడింది.

Next Story