ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా మెుజ్తబా ఖమేనీ
ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం...
By - అంజి |
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా మెుజ్తబా ఖమేనీ
ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం, ఆయన వారసుడిగా కుమారుడు మెుజ్తబా ఖమేనీ ఎంపికయ్యారు. ఇరాన్లోని అత్యున్నత నిర్ణయాక మండలి 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్' ఈ నిర్ణయం తీసుకున్నట్లు 'ఇరాన్ ఇంటర్నేషనల్' నివేదించింది. ఇరాన్ అత్యున్నత నాయకత్వ బాధ్యతలను అలీ ఖమేనీ రెండో కుమారుడు మెుజ్తబా ఖమేనీ (56) చేపట్టనున్నారు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ సిద్ధాంతాల ప్రకారం ఇది అత్యంత సున్నితమైన అంశం. ఎందుకంటే, ఇరాన్ ఎప్పుడూ రాచరికాన్ని (వారసత్వ పాలనను) వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి తర్వాత కొడుకే అధికారంలోకి రావడం ఆ సిద్ధాంతాలకు విరుద్ధమని విశ్లేషకులు భావిస్తున్నారు.
IRGC ఒత్తిడితోనే ఎంపిక?
నివేదికల ప్రకారం, మెుజ్తబా ఎంపిక వెనుక ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కీలక పాత్ర పోషించింది. మెుజ్తబాను నాయకుడిగా ఎన్నుకోవాలని 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్'లోని మతగురువులపై IRGC తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. మెుజ్తబాకు సైన్యంతో మొదటి నుంచీ బలమైన సంబంధాలు ఉన్నాయి. 1980లలో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో ఆయన సైనికుడిగా పనిచేశారు.
అపరిమిత అధికారాలు
ఇరాన్ రాజకీయాల్లో 'సుప్రీం లీడర్' పదవికి విశేష అధికారాలు ఉంటాయి. దేశీయ మరియు విదేశీ వ్యవహారాల్లో సుప్రీం లీడర్దే తుది నిర్ణయం. సాయుధ దళాలకు మరియు రివల్యూషనరీ గార్డ్కు ఆయనే కమాండర్-ఇన్-చీఫ్గా వ్యవహరిస్తారు. మెుజ్తబా గత కొంతకాలంగా తన తండ్రి కార్యాలయాన్ని తెర వెనుక నుండి నడిపిస్తున్నారని, వ్యవస్థలో ఆయన ఒక కీలకమైన 'పవర్ బ్రోకర్' అని విశ్లేషకులు పేర్కొంటారు.