మనిషి మెదడును తినే వ్యాధి సోకి.. ఆ దేశంలో తొలి మరణం నమోదు

Brain eating amoeba kills south korean man. చైనా దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. దక్షిణ కొరియాలో అరుదైన వ్యాధి

By అంజి  Published on  27 Dec 2022 11:49 AM GMT
మనిషి మెదడును తినే వ్యాధి సోకి.. ఆ దేశంలో తొలి మరణం నమోదు

చైనా దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. దక్షిణ కొరియాలో అరుదైన వ్యాధి నేగ్లేరియా ఫౌలెరి ఇన్ఫెక్షన్ మొదటి కేసు నమోదైంది. 50 ఏళ్ల వ్యక్తి నైగ్లేరియా ఫౌలెరీ ఇన్ఫెక్షన్ సోకి మరణించాడని కొరియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ వ్యాధి తొలి మరణం నమోదైంది. ఈ వ్యాధిని 'బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా' అని కూడా పిలుస్తారు. డిసెంబర్ 10న కొరియాకు తిరిగి రావడానికి ముందు నాలుగు నెలల సదరు వ్యక్తి థాయ్‌లాండ్‌లో ఉన్నాడు. కొరియాకు వచ్చిన మరునాడే అతడు ఆస్పత్రిలో చేరాడు. గత మంగళవారం అతడు చనిపోయాడని అధికారులు తెలిపారు. కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ దీనిని ధృవీకరించింది.

మెదడును తినే అమీబా నేగ్లేరియా ఫౌలెరీ అంటే ఏమిటి?

నేగ్లేరియా అనేది ఏకకణ జీవి. ఇది ఉనికిలో సూక్ష్మదర్శినిగా ఉంటుంది. స్వేచ్ఛా-జీవన అమీబా సరస్సులు, నదులు, మట్టితో సహా మంచినీటి వ్యవస్థలన్నింటిలో ఇది ఉంటుంది. అయినప్పటికీ అమీబా అన్ని జాతులు కిల్లర్ వైఖరిని కలిగి ఉండవు. నేగ్లేరియా ఫౌలెరి అనేది మాత్రమే మానవులకు సోకుతుంది. 1937లో తొలిసారిగా బ్రెయిన్‌ ఈటింగ్‌ ఆమీబా అమెరికాలో వెలుగు చూసింది. ఇది మనిషి ముక్క లేదా నోరు, చెవి ద్వారా శరీరంలో ప్రవేశించి మెదడు క్రమక్రమంగా తింటుంది. దీంతో మరణం సంభవిస్తుంది. ఇది సోకినప్పుడు జ్వరం, వికారం, వాంతులు, మెడ బిగుసుకుపోవడం వంటివి జరుగుతాయి. పరిస్థితి తీవ్రంగా ఉంటే, మూర్ఛలు, మానసిక స్థితి మారడం, వాంతులు, కోమాకు కూడా దారితీయవచ్చు. యునైటెడ్ స్టేట్స్‌లో 154 మందిలో నలుగురు మాత్రమే 1962 నుండి 2021 వరకు ఈ వ్యాధి నుండి బయటపడ్డారు.

ఇది మనిషి నుండి మనిషికి వ్యాపించగలదా?

లేదు, నేగ్లేరియా ఫౌలెరి ఇన్ఫెక్షన్ ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాపించదు.

నేగ్లేరియా ఫౌలెరీకి వ్యాక్సిన్ ఉందా?

కొన్ని చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక ప్రభావవంతమైన చికిత్స ఇంకా గుర్తించబడలేదు.

Next Story