సముద్రంలో కొట్టుకుపోతున్న ఓడలో 400 మంది వలసదారులు

400 మంది వలసదారులతో వెళ్తున్న ఓ పడవ గ్రీస్, మాల్టా మధ్య ఉన్న మధ్యదరా సముద్రంలో చిక్కుకుపోయింది.

By అంజి
Published on : 10 April 2023 9:00 AM IST

Greece, Malta,Boat, 400 migrants

సముద్రంలో కొట్టుకుపోతున్న ఓడలో 400 మంది వలసదారులు 

400 మంది వలసదారులతో వెళ్తున్న ఓ పడవ గ్రీస్, మాల్టా మధ్య ఉన్న మధ్యదరా సముద్రంలో చిక్కుకుపోయింది. ఇటీవల కాలంలో ఉత్తర ఆఫ్రికా నుండి మధ్యధరా సముద్రం దాటుతున్న వలస పడవలు ఒక్కసారిగా పెరిగాయి. తాజాగా దాదాపు 400 మంది వ్యక్తులతో కూడిన ఓడ గ్రీస్, మాల్టాల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పడవలో ఇంధనం పూర్తిగా అయిపోయింది. దీంతో బోటు కెప్టెన్‌ అక్కడినుంచి తప్పించుకున్నాడు. పడవ కింది భాగంలోకి నీరు వచ్చిందని సహాయక సేవ అలారం ఫోన్ ఆదివారం తెలిపింది.

రాత్రిపూట లిబియాలోని టోబ్రూక్ నుండి బయలుదేరిన పడవ నుండి తమకు కాల్ వచ్చిందని, వారు అధికారులకు సమాచారం అందించారని అలారం ఫోన్ ట్విట్టర్‌లో తెలిపింది. కానీ అధికారులు ఇప్పటి వరకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించలేదని వారు తెలిపారు. పడవ ఇప్పుడు మాల్టీస్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏరియా (SAR)లో ఉందని అలారం ఫోన్ తెలిపింది. జర్మన్ ఎన్జీవో సీ-వాచ్ ఇంటర్నేషనల్ తన ట్విట్టర్ ఖాతాలో.. వలసదారుల పడవకు సమీపంలో రెండు వాణిజ్య నౌకలు ఉన్న పడవను కనుగొన్నట్లు తెలిపింది.

అయితే మాల్టీస్ అధికారులు ఆ పడవను రక్షించవద్దని ఆదేశించారని, ఇంధనాన్ని సరఫరా చేయమని కోరారని పేర్కొంది. అయితే దీనిపై వివరణ కోసం మాల్టా అధికారులను సంప్రదించడం వెంటనే సాధ్యం కాదు. అలారం ఫోన్.. పడవలో ఉన్న వ్యక్తులు భయాందోళనలకు గురవుతున్నారని, వారిలో చాలా మందికి వైద్య సహాయం అవసరమని చెప్పింది. మరోవైపు పడవను నడిపించే వారు ఎవరూ అందులో లేరని చెప్పింది.

Next Story