భారత్లో 70వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్ Published on 12 May 2020 5:08 AM GMTభారత్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3244 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 87 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70,756 చేరింది. ఈ మహమ్మారి భారీన పడి ఇప్పటి వరకు 2293 మంది మృతి చెందారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 22,454 మంది డిశ్చార్జి కాగా.. 46,008 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. నిన్న ఒక్క రోజో 1230 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 23,401 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 868 మంది మరణించారు. గుజరాత్లో 8541 కేసులు నమోదు కాగా.. 513 ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్లో 3785 కేసులు నమోదు కాగా.. 221 మరణించారు. తమిళనాడులో 8002 కేసులు నమోదు కాగా.. 53 మంది మృత్యువాత పడ్డారు. పశ్చిమ బెంగాల్ లో 2063 కేసులు నమోదు కాగా.. 190 మంది మరణించారు. రాజస్థాన్లో ఇప్పటి వరకు కరోనా సోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 113కు చేరగా.. 3988 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. ఇక తెలంగాణలో 1275 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 30 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్లో 2018 కేసులు నమోదు కాగా... 45 మంది చనిపోయారు.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతున్న తీరు, రాష్ట్రా ల అభిప్రాయాలన తెలుసుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో నిన్న వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా.. దేశ వ్యాప్తంగడా వలస కార్మికుల తరలింపు, లాక్డౌన్ సడలింపు ఇస్తున్న నేపథ్యంలో వైరస్ తీవ్రత పెరగడం ఆందోళన కలిగిస్తోంది.