భారత్‌లో 24గంటల్లో 9,971 కేసులు, 287 మరణాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Jun 2020 5:09 AM GMT
భారత్‌లో 24గంటల్లో 9,971 కేసులు, 287 మరణాలు

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9,971 కేసులు నమోదు కాగా.. 287 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 2,46,628 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 6,929 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదైన కేసుల్లో 1,20,406 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 1,19,293 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

గత నాలుగు రోజులుగా దేశంలో 9 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండగా.. కొన్ని రోజులుగా ప్రతి రోజు 200పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ 5వ స్థానానికి ఎగబాకింది. కరోనా కేసుల్లో స్పెయిన్‌ ఐదో స్థానంలో ఉండగా.. ఆదేశాన్ని దాటి భారత్‌ 5వ స్థానానికి చేరుకుందని జాన్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం తెలిపింది. అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. బ్రెజిల్‌, రష్యా, యూకే ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. నిన్ననే భారత్‌ ఇటలీని కూడా దాటేవేసిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ కేసులు ఇప్పటి వరకు 69లక్షలకు చేరగా.. 4లక్షలకు పైగా మంది ఈ మహమ్మారి బారీన పడి మృత్యువాత పడ్డారు.

Next Story