గుండెపోటుతో 'సియాసత్' మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి

సియాసత్ డైలీ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ గుండెపోటుతో మరణించారు.

By Medi Samrat  Published on  7 Aug 2023 2:58 PM GMT
గుండెపోటుతో సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి

సియాసత్ డైలీ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ గుండెపోటుతో మరణించారు. ఆయ‌న వ‌య‌సు ప్ర‌స్తుతం 60 ఏళ్లు. ఆయ‌న‌ స్నేహితులు, సహచరులు అతన్ని 'జహీర్ భాయ్' అని పిలుస్తారు. జహీరుద్దీన్ మ‌ర‌ణ‌ వార్త జంట నగరాల్లోని పలువురు జర్నలిస్టులను దిగ్భ్రాంతికి గురి చేసింది. జహీరుద్దీన్ సోమవారం సాయంత్రం విప్లవ కవి గుమ్మడి విట్టల్ రావు ‘గద్దర్’ అంత్యక్రియలకు హాజరయ్యారు.

అంతిమ‌యాత్ర‌లో జహీరుద్దీన్ అకస్మాత్తుగా పడిపోయారు. ప‌క్క‌న ఉన్న‌వారు CPR చేయడం ద్వారా ఆయ‌న‌కు సహాయం చేసేందుకు ప్రయత్నించారు. అంబులెన్స్‌కు స‌మాచారం ఇచ్చి జహీరుద్దీన్ ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జహీరుద్దీన్ మరణానికి తొక్కిసలాట కారణమని న్యూస్ వైరల్ అవుతుండ‌గా.. ఆ వార్త‌లు ఫేక్ అని తేలింది.

జహీరుద్దీన్ అలీ ఖాన్ చార్టెడ్ అకౌంటెంట్. గత 35 సంవత్సరాలుగా జర్నలిజం రంగంలో ఉన్నారు. ఆయ‌న‌ సియాసత్ మేనేజింగ్ డైరెక్టర్ జాహిద్ అలీ ఖాన్ బంధువు. ఆయ‌న‌ తమ్ముడు డాక్టర్ మజర్ అలీ ఖాన్.. ఇటీవల తనను తాను కాల్చుకుని చనిపోయాడు. పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.

Next Story