సికింద్రాబాద్‌ ప్రజలతో మమేకమైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Union Minister Kishan Reddy undertakes padyatra in Secunderabad. హైదరాబాద్: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం తన సికింద్రాబాద్

By అంజి  Published on  27 Nov 2022 10:09 AM GMT
సికింద్రాబాద్‌ ప్రజలతో మమేకమైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం తన సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తన మద్దతుదారులతో కలిసి అడ్డగుట్ట డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమయ్యారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కిషన్‌రెడ్డి అడిగి తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆయనకు వినతిపత్రాలు అందించారు.

''నా నియోజకవర్గాలతో ప్రజలతో నిజాయితీగా సంభాషించడం నాకు ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా ఉంటుంది'' అని కిషన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను కేంద్ర మంత్రి తన పాదయాత్రలో ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఆయన ఎత్తిచూపారు. అడ్డగుట్ట, తుకారాం గేట్, తార్నాక, లాలాపేట్, మెట్టుగూడ వంటి ప్రాంతాల్లో కిషన్‌ రెడ్డి పాదయాత్ర చేశారు. డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల సమస్యలపై స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కిషన్‌ రెడ్డి జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం కింద నిర్వాసితులకు ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.

Next Story