హైదరాబాద్‌: భారత్‌ బయోటెక్‌లో మోదీ సందర్శన దృశ్యాలు

Scenes of Modi's visit to Bharat biotech.. ప్రధాని నరేంద్రమోదీ శనివారం హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ను సందర్శించి

By సుభాష్  Published on  28 Nov 2020 10:54 AM GMT
హైదరాబాద్‌: భారత్‌ బయోటెక్‌లో మోదీ సందర్శన దృశ్యాలు

ప్రధాని నరేంద్రమోదీ శనివారం హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ను సందర్శించి పరిశీలించారు. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన మోదీ.. నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ చేరుకున్నారు. అక్కడ జైడస్‌ బయోటెక్‌ పార్క్‌ను సందర్శించారు. అనంతరం అహ్మదాబాద్‌ నుంచి హైదరాబాద్‌ హకీంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి నేరుగా కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసే భారత్‌ బయోటెక్‌కు చేరుకున్నారు.



భారత్‌ బయోటెక్‌లో వ్యాక్సిన్‌ తయారీ, పురోగతిపై శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తికి సంబంధించి పూర్తి వివరాలను శాస్త్రవేత్తలను మోదీ అడిగి తెలుసుకున్నారు. భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతోంది. బయోటెక్‌లో మోదీ తిరుగుతూ సందర్శించారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి, తయారీ గురించి అక్కడి శాస్త్రవేత్తలు మోదీకి వివరించారు.



కాగా, ప్రభుత్వం-ప్రైవేటు భాగస్వామ్యంలో ఐసీఎంఆర్‌, భారత్‌ బయోటెక్‌ సంయుక్తంగా కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దాదాపు గంట పాటు ప్రధాని మోదీ శాస్త్రవేత్తలతో చర్చించారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతోంది. మొదటి రెండు దశల్లో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా మంచి ఫలితాలు రావడంతో మూడో దశను కొనసాగిస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌.. ఎప్పటిలోగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని మోదీ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.



వ్యాక్సిన్‌ తయారీ ఎంత వరకు వచ్చిందనే విషయాన్ని మోదీ ఆరా తీశారు. వ్యాక్సిన్ ఉత్పత్తి, తయారీ గురించి మోదీకి వివరించారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని మోదీ అన్నారు. శాస్త్రవేత్తల కృషికి మోదీ అభినందించారు. వ్యాక్సిన్‌ తయారీకి మరింత కృషి చేయాలని మోదీ సూచించారు.




Next Story