మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, మాజీ సీపీ ఏకే ఖాన్‌, అతని కుమారుడిపై చీటింగ్ కేసు

Rtd IPS officer A K Khan, son Moshin Khan and Congress leader Shabbir Ali booked for cheating business man. హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మహ్మద్‌ షబ్బీర్‌ అలీ, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏకే ఖాన్‌, ఆయన కుమారుడు మొహిసిన్‌ ఖాన్‌లపై

By అంజి  Published on  18 Sep 2022 5:27 AM GMT
మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, మాజీ సీపీ ఏకే ఖాన్‌, అతని కుమారుడిపై చీటింగ్ కేసు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మహ్మద్‌ షబ్బీర్‌ అలీ, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏకే ఖాన్‌, ఆయన కుమారుడు మొహిసిన్‌ ఖాన్‌లపై హైదరాబాద్‌ పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. ఏకే ఖాన్ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా ఉన్నారు. హైదరాబాద్‌లోని స్థానిక కోర్టు ఆదేశాల మేరకు, పంజాగుట్ట పోలీసులు ఈ ముగ్గురిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 465, 420, 406 మరియు r/w 156(3) Cr.PC కింద కేసు నమోదు చేశారు. ఎక్కువ లాభాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి తన వద్ద నుంచి దాదాపు 90 లక్షల రూపాయల వరకు తీసుకున్నారని వృత్తిరీత్యా వ్యాపారి అయినా మహ్మద్ అబ్దుల్ వాహబ్ (51 సంవత్సరాలు) కోర్టును ఆశ్రయించారు.

నేరం ఏమిటి?

''ఈ కేసు 2016 నాటిది. రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి ఏకే ఖాన్ కుమారుడు మొహ్సిన్ ఖాన్ ఫిర్యాదుదారు మహ్మద్ అబ్దుల్ వాహబ్‌ను సంప్రదించాడు. అతను (మొహ్సిన్) బంజారాహిల్స్ రోడ్ నెం-1 వద్ద ఉన్న Ms. సన్‌లిట్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అని పేర్కొన్నాడు. కంపెనీ మైనింగ్ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా రామానుజవరం గ్రామంలో 46 ఎకరాల విస్తీర్ణంలో ఇసుక డీకాస్టింగ్‌లో నిమగ్నమై ఉన్న తపస్వి ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో కంపెనీకి తాను లైసెన్స్ పొందినట్లు మొహ్సిన్ అబ్దుల్‌తో చెప్పాడు.''

సన్‌లిట్‌ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుకూలంగా తపస్వి ఇన్‌ఫ్రా 25% వాటాలను విక్రయించిందని, ఇసుక పనిని తొలగించడంలో భారీ లాభాలు వస్తాయని మొహ్సిన్ అబ్దుల్‌తో చెప్పారు. తపస్వి కంపెనీతో అగ్రిమెంట్ డాక్యుమెంట్‌గా మొహ్సిన్ అబ్దుల్‌ వాహబ్‌కు నకిలీ పత్రాలు చూపించాడు. తాను రూ. 6.5 కోట్ల లాభాన్ని ఆశిస్తున్నానని, కంపెనీలో రూ. 90 లక్షలు పెట్టుబడి పెడితే తన లాభాల్లో 50% ఇస్తానని మొహ్సిన్ అబ్దుల్‌తో చెప్పాడు. ఆ తర్వాత ఇసుక, మైనింగ్ కార్యకలాపాలను డీ-కాస్టింగ్ చేయడానికి మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడి పెట్టారు.

అయితే మొదట్లో పెట్టుబడి పెట్టడానికి అబ్దుల్ వెనుకాడాడు. దీంతో అబ్దుల్‌ను మొహసిన్ అతనిని ఇంటికి తీసుకెళ్లి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీకి పరిచయం చేసాడు. మొహ్సిన్ షబ్బీర్ అలీకి అల్లుడు. పెట్టుబడి పెట్టేందుకు అబ్దుల్‌ వాహబ్‌కు షబ్బీర్ అలీతో మోహిన్ ఖాన్ సిఫార్సు చేయించాడు. గతంలో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా పనిచేసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కుమారుడని, మాజీ మంత్రికి అల్లుడు అబ్దుల్‌ వ్యాపారంలో రూ.90 లక్షలు పెట్టుబడి పెట్టాడు. సన్‌లిట్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాకు డబ్బు బదిలీ చేశాడు.

అయితే 2016 నుండి మూడు సంవత్సరాల పాటు మొహ్సిన్ అబ్దుల్‌కు లాభాలు చెల్లించడంలో విఫలమయ్యాడు. ఆలస్యమైనందుకు విసుగు చెందిన అబ్దుల్ ఆ మొత్తం కోసం పట్టుబట్టాడు, దానికి విరుద్ధంగా షబ్బీర్ అలీ, ఏ.కే ఖాన్ పేర్లను చెబుతూ మొహ్సిన్ అతన్ని బెదిరించాడు.

ఈ నేరంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ పాత్ర ఉంది

సంవత్సరాలు గడిచిపోయాయి. మొహ్సిన్ అబ్దుల్‌కు ఎలాంటి లాభాలు చెల్లించలేకపోయాడు. ఆ తర్వాత అతను అబ్దుల్‌ను తన తండ్రి-రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి ఏకే ఖాన్ వద్దకు తీసుకెళ్లాడు. చెల్లింపుల్లో ఏదైనా డిఫాల్ట్ అయితే బాధ్యత తనదేనని మొదట్లో ఏకే ఖాన్ హామీ ఇచ్చారు. అయితే ఐదేళ్ల తర్వాత షబ్బీర్ అలీ, ఏకే ఖాన్ ఆ మొత్తాన్ని చెల్లించేందుకు నిరాకరించారు. ఈ క్రమంలోనే ఫోర్జరీ, నమ్మక ద్రోహంపై అబ్దుల్ కోర్టు తలుపు తట్టాడు. కోర్టు పిటిషన్‌ను అనుసరించి షబ్బీర్ అలీ, ఏకే ఖాన్, మొహ్సిన్ ఖాన్, సన్‌లిట్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై కేసు నమోదైంది.

Next Story