ఫుడ్ లవర్స్కు గుడ్న్యూస్.. 'ప్యారడైజ్' మెనూలో రెండు కొత్త వంటకాలు
Paradise adds fiery biryani and kebab to existing menu. ప్యారడైజ్ బిర్యానీ ఫుడ్ లవర్స్ గుడ్న్యూస్. ప్రముఖ ప్యారడైజ్ ఫుడ్ కోర్టు తమ ప్రస్తుత మెనూలో సరికొత్త బిర్యానీ, కబాబ్లను
By అంజి Published on 20 July 2022 12:07 PM GMTప్యారడైజ్ బిర్యానీ ఫుడ్ లవర్స్ గుడ్న్యూస్. ప్రముఖ ప్యారడైజ్ ఫుడ్ కోర్టు తమ ప్రస్తుత మెనూలో సరికొత్త బిర్యానీ, కబాబ్లను జోడించినట్లు బుధవారం ప్రకటించింది. ఫైరీ చికెన్ బిర్యానీ, ఫైరీ చికెన్ కబాబ్ అనే రెండు కొత్త వంటకాలు స్పైసీ ఫుడ్స్ పేరుతో తీసుకొచ్చినట్టు తెలిపింది. ప్రస్తుతం దేశంలోని అన్ని ఔట్లెట్లలో ఈ రెండు కొత్త వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ఆహార ప్రియులు వెంటనే దగ్గర్లోని ప్యారడైజ్ బిర్యానీ పాయింట్కు వెళ్లి ఈ కొత్త వంటకాలను రుచి చూడొచ్చు.
రెండు కొత్త వంటకాలపై ప్యారడైజ్ బిర్యానీ ఎండీ గౌతమ్ గుప్తా మాట్లాడారు. ''మేం మా మెనూలో కొంత కొత్తదనాన్ని తీసుకురావాలనుకుంటున్నాము. అందుకే.. మేం కొత్త బిర్యానీ, కబాబ్తో రావాలని నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా, హలీమ్ సీజన్లో మేం ప్రత్యేకంగా అదనపు మసాలా దినుసులతో వండిన వంటలను కస్టమర్లు ఎంతో ఆనందించారని మా కస్టమర్ బేస్ నుంచి గ్రహించాం. మా చెఫ్ మాస్టర్లు మసాలా దినుసులు జాగ్రత్తగా ఎంచుకొని, సువాసన వచ్చేలా సున్నితంగా వండుతారు. బిర్యానీ, కబాబ్ కస్టమర్లు ఇష్టపడతారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము.'' అని చెప్పారు.
కొత్త రిసిపిని రుచి చూసేందుకు ఇప్పటికే చాలా మంది బారులు తీరుతున్నారని గుప్తా తెలిపారు.
''సంవత్సరంలో అత్యధిక బిర్యానీలు వడ్డించినందుకు'' లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ప్యారడైజ్ ఫుడ్ చైన్ చోటు సంపాదించుకుంది. 2017లో 70 లక్షలకు పైగా బిర్యానీలను అందించగా, 2018లో వాటి సంఖ్య 90 లక్షలకు పైగా చేరింది.
ప్యారడైజ్ బిర్యానీ చరిత్ర
1953 సంవత్సరములో సికింద్రాబాద్లో 'ప్యారడైజ్ టాకీస్' పేరిట సినిమా థియేటర్ నడిచేది. థియేటర్కు అనుబంధంగా సమోసా, చాయ్, బిస్కెట్ అమ్మే చిన్న టీ కొట్టు ఉండేది. ఇరాన్ నుంచి వలస వచ్చిన హుస్సేన్ హిమ్మతీ దాన్ని నడిపేవారు. మెల్లగా ప్యారడైజ్ టాకీస్ కనుమరుగైపోయింది. కానీ హుస్సేన్ హిమ్మతీ టీకొట్టు మాత్రం మెల్లగా ఎదగటం మొదలుపెట్టింది. 10 మందికి పని కల్పించిన ఆ టీ కొట్టు 2014 నాటికి 800 మందికి పైగా ఉద్యోగాలిచ్చే ప్యారడైజ్ హోటల్గా ఎదిగింది. హుస్సేన్ తర్వాత ఆయన కొడుకులు అలీ హిమ్మతీ, డాక్టర్ ఖాజీం హిమ్మతీలు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేలా దాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో పాటు దేశ వ్యాప్తంగా ప్యారడైజ్ హోటళ్లు ఉన్నాయి.
వంటల తయారీ
దేశ, విదేశీ ప్రతినిధుల నోరూరించే ప్యారడైజ్ బిర్యానీ తయారీకి వస్తువుల్ని దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దిగుమతి చేసుకుంటారు. ప్యారడైజ్ బిర్యానీకి ఉపయోగించే ధావత్ బాస్మతీ బియ్యాన్ని ఢిల్లీ నుంచి, సుగంధ ద్రవ్యాలైన సాఫ్రాన్ను కాశ్మీర్, ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటారు. మాంసం ఉత్పత్తుల్ని మాత్రం హైదరాబాద్లోని చెంగిచెర్ల నుంచి, తృణ ధాన్యాలు, గరం మసాలా, ఇతర దినుసులన్నిటినీ బేగంబజార్ నుంచే తెచ్చుకుంటారు. ఇవన్నీ స్థానికంగా లభించేవే. హైదరాబాద్ నుంచి దుబాయ్, ముంబై, చెన్నై నగరాలకు విమానాల్లో బిర్యానీ పార్శిల్స్ వెళ్తుంటాయి.