వివాదంగా మారుతున్న నిజాం ముఖరం ఝా అంత్యక్రియలు
Nizam Mukheram Jha's funeral is turning into a controversy. పూర్వపు హైదరాబాద్ సంస్థానానికి చెందిన ఎనిమిదో నిజాం అయిన ముఖరం జా
By అంజి Published on 17 Jan 2023 12:47 PM IST
పూర్వపు హైదరాబాద్ సంస్థానానికి చెందిన ఎనిమిదో నిజాం అయిన ముఖరం జా అంత్యక్రియలను అధికారిక గౌరవాలతో నిర్వహించాలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తెలంగాణలోని విశ్వహిందూ పరిషత్ సోమవారం అడ్డు చెబుతోంది. ఇది నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్న వారి త్యాగాలను అవమానించడమేనని ఆ సంస్థ పేర్కొంది. నిజాం వారసత్వాన్ని అధికారికంగా గుర్తించడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని వీహెచ్పీ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది.
అప్పటి హైదరాబాద్ సంస్థానంలో హిందువులపై 'రజాకార్లు' (నిజాం పాలనకు సాయుధ మద్దతుదారులు) చేసిన అకృత్యాలను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని పేర్కొంది. 'హైదరాబాద్ రాష్ట్ర విమోచన' 75 ఏళ్లను పురస్కరించుకుని కేంద్రం వేడుకలు నిర్వహిస్తున్న తరుణంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. హైదరాబాద్ రాష్ట్రాన్ని పాకిస్తాన్ లో విలీనం చేసేందుకు ప్రయత్నం చేసిన నిజాం దేశద్రోహ చర్య మరిచారా అని ప్రశ్నిస్తున్నారు.
టర్కీలోని ఇస్తాంబుల్లో నిజాం VIII అనే బిరుదుగల ముకర్రం జా కన్నుమూశారు. ఆయన జనవరి 14న మరణించారు. తన స్వదేశంలో అంత్యక్రియలు చేయాలన్న ఆయన కోరిక మేరకు, ఆయన పిల్లలు నేడు దివంగత నిజాం పార్థివదేహంతో హైదరాబాద్కు రానున్నారు. నిజాం వారసుడిగా పేదలకు విద్య, వైద్య రంగాల్లో ముకరం ఝా చేసిన సామాజిక సేవలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జా అంత్యక్రియలను అత్యున్నత ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.