ఒవైసీ-మిధాని ఫ్లై ఓవర్కు అబ్దుల్ కలాం పేరు.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్
KTR launches APJ Abdul Kalam flyover at Owaisi junction.ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. జీహెచ్ఎంసీ
By - తోట వంశీ కుమార్ |
ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన ఒవైసీ-మిధాని ఫ్లై ఓవర్ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, బల్దియా మేయర్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా 1.3కిలోమీటర్ల పొడవుతో మూడు వరుసలతో ఈ ఫ్లై ఓవర్ను నిర్మించారు. ఇందుకోసం రూ.63 కోట్లను ఖర్చుచేశారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో మిధాని-డీఎంఆర్ఎల్ కూడళ్ల మధ్య వాహనాల రద్దీ తగ్గనుంది. మెహదీపట్నం, చాంద్రాయణగుట్ట, మిధాని నుంచి వచ్చే వాహనదారులు ఈ పైవంతెన ద్వారా మందమల్లమ్మ, సంతోష్నగర్, సాగర్ రింగ్ రోడ్డు, ఎల్బీ నగర్ ప్రాంతాలకు సునాయాసంగా చేరుకోవచ్చు.
ఫ్లై ఓవర్కు అబ్దుల్ కలాం పేరు..
కాగా.. ఒవైసీ-మిధాని ఫ్లై ఓవర్కు భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరును పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. డీఆర్డీవోలో పని చేసిన గొప్ప మనిషి అబ్దుల్ కలాంకు ఇదే మా నివాళి అని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో దశాబ్దం పాటు అబ్దుల్ కలాం నివాసం ఉన్నారనన్నారు. ఈ ప్రాంతంలో ఎంతో అవినాభావ సంబంధం ఉన్న కలాంకు తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఫ్లై ఓవర్ ఏరియల్ వ్యూ వీడియోని షేర్ చేశారు.
A short video on the just inaugurated Owaisi-Midhai Junction flyover built under #SRDP by #GHMC
— KTR (@KTRTRS) December 28, 2021
We have decided to name it after Hon'ble former president APJ Abdul Kalam Ji 🙏
Small tribute a great man who worked at DRDO & also lived in the neighbourhood for over a decade pic.twitter.com/XgS5f6wUXo