గోల్కొండలో పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై సమీక్షించిన డీజీపీ

చారిత్రక గోల్కొండ కోట పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబు అవుతోంది. ఏర్పాట్లపై డీజీపీ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.

By Srikanth Gundamalla  Published on  12 Aug 2023 4:15 AM GMT
Independence Day, Golconda, DGP Anjani Kumar, Hyderabad,

గోల్కొండలో పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై సమీక్షించిన డీజీపీ

హైదరాబాద్: చారిత్రక గోల్కొండ కోట పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబు అవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై డీజీపీ అంజనీకుమార్‌ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. సీఎం కేసీఆర్ ఆగస్టు న ఉదయం సికింద్రాబాద్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత.. ఉదయం గంటలకు గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ చేస్తారని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు డీజీపీ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో నగర సీపీ సీవీ ఆనంద్‌, అడిషనల్ డీజీ స్వాతి లక్రా, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, ప్రోటోకాల్ డైరెక్టర్ అరవింద్ సింగ్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సందర్శకుల కోసం ప్రత్యేక ఎల్‌ఈడీలు:

గోల్కొండలో జరిగే పంద్రాగస్టు వేడుకలకు చాలా మంది హాజరవుతున్నారు. పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరవుతారు. ఈ క్రమంలో సభా ప్రాంగణలో ఎంత దూరంలో ఉన్నా కార్యక్రమాన్ని స్పష్టంగా వీక్షించేందుకు పెద్ద ఎల్‌ఈడీలను ఏర్పాటు చేశామని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్‌ రెడ్డి తెలిపారు. కార్యక్రమం లైవ్ కవరేజ్‌ కోసం 10 కెమెరా యూనిట్‌లను, లైవ్‌ కవరేజ్‌ లింకింగ్‌కు అవసరమైన చర్యలు తీసుకున్నామని వివరించారు.

సభా ప్రాంగణంలో సర్వం సిద్దం:

సభకు వచ్చిన ముఖ్య అతిధులు, అధికారులు, సందర్శకులు, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు డీజీపీ అంజనీకుమార్‌కు వివరించారు. హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో లక్ష వాటర్ ప్యాకెట్లు, 25వేల వాటర్ బాటిళ్లు ఏర్పాటు చేశామని జలమండలి ఎండీ దాన కిషోర్ వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు అందించేందుకు సభా ప్రాంగణంలో 4 ఆంబులెన్సులు, గోల్కొండ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒగ గదిని సిద్దంగా ఉంచామని వైధ్యశాఖ అధికారులు తెలిపారు. 3 ఫైర్ ఇంజన్లు 6 బెస్ట్ బైక్స్, 4 ల్యాడర్లు ఏర్పాటు చేయనున్నామని ఫైర్ శాఖ అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా ప్రత్యేక జనరేటర్లు, వర్షం పడినా ఇబ్బందులు లేకుండా వ్వాటర్ ప్రూఫ్ షెడ్లను ఏర్పాటు చేశామని విద్యుత్ శాఖ, రహదారులు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు తెలిపారు. ముఖ్యమంత్రి కి దాదాపు 1200 మంది కళాకారులు స్వాగతం పలుకుతారని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ అన్నారు.

1930 వాహనాలకు పార్కింగ్ సదుపాయం:

గోల్కొండ కోట పరిసర ప్రాంతాలలో పార్కింగ్ వివరాలను డీజీపీ అడిగి తెలుసుకున్నారు. మొత్తం 1930 వాహనాల పార్కింగ్ కు ఏర్పాట్లు చేశామని ట్రాఫిక్ అదనపు సిపి సుధీర్ బాబు తెలిపారు. మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపిలకు, మీడియా వాహనాలకు సందర్శకులకు వేరు వేరుగా పార్కింగ్ స్థలాలు కేటాయించామన్నారు. జీహెచ్ఎంసీ అధ్యర్యంలో శానిటేషన్ తదితర ఏర్పాట్లను చేపడుతున్నట్లు తెలిపారు.

Next Story