హైదరాబాద్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సోమవారం (ఏప్రిల్ 13, 2026) రాత్రి 7:30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య జరగనున్న...

By -  అంజి
Published on : 13 April 2026 1:33 PM IST

Hyderabad Metro Rail, IPL 2026 Services, Uppal Stadium Metro, SRH vs RR Match, Midnight Metro Extension

హైదరాబాద్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు 

హైదరాబాద్‌: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సోమవారం (ఏప్రిల్ 13, 2026) రాత్రి 7:30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో రైలు కీలక నిర్ణయం తీసుకుంది. స్టేడియంకు వచ్చే అభిమానుల రద్దీని, మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రయాణికుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, మెట్రో సేవలను అర్ధరాత్రి 12:00 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

L&T హైదరాబాద్ మెట్రో రైల్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం, మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులు స్టేడియం (Stadium) లేదా ఎన్‌జీఆర్ఐ (NGRI) మెట్రో స్టేషన్లలో రైలు ఎక్కవచ్చు. ఈ పొడిగించిన సేవలు మెట్రోలోని అన్ని కారిడార్లలో అందుబాటులో ఉంటాయి. దీనివల్ల స్టేడియం నుండి తమ ఇళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, సులభంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం కలుగుతుంది. సోమవారం ఉదయం సోషల్ మీడియా వేదికగా మెట్రో యాజమాన్యం ఈ విషయాన్ని ధృవీకరించింది.

Next Story