హైదరాబాద్ విమోచన దినోత్సవం: స్వాతంత్య్రానికి ముందు హైదరాబాద్ ఎలా ఉండేదంటే..!

Hyderabad Liberation Day.. Here's everything about erstwhile Hyderabad before Independence. హైదరాబాద్: భారత స్వాతంత్య్రానికి ముందు హైదరాబాద్ రాష్ట్రం బ్రిటీష్ ఇండియా భూభాగంలో ఉండేది. మూడు భాషా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Sep 2022 1:08 PM GMT
హైదరాబాద్ విమోచన దినోత్సవం: స్వాతంత్య్రానికి ముందు హైదరాబాద్ ఎలా ఉండేదంటే..!

సెప్టెంబర్ 17 వరకు న్యూస్‌మీటర్ ప్రముఖ వ్యక్తుల నుండి నివేదికలను ప్రచురిస్తుంది. మా నివేదికలు ఆనాటి చారిత్రక ప్రాముఖ్యతను లోతుగా పరిశీలిస్తాయి. సంఘటన రాజకీయాల జోలికి వెళ్లకుండా, నిజాం పాలనపై సుదీర్ఘ పోరాటం, సాయుధ ప్రతిఘటన, స్వాతంత్య్ర పోరాటం, ఆపరేషన్ పోలో మొదలైన వాటిపై చర్చిస్తాం.

మా కథనాలు బ్రిటిష్ వారి నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం, విభజనపై దృష్టి పెడతాయి. రాచరిక రాష్ట్రాలు భారత యూనియన్‌లో ఎలా చేరిందో మేము హైలైట్ చేస్తాము. మూడు భాషా ప్రాంతాలను కలిగి ఉన్న నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ ఎలా ఉంది. తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతం (రాజధాని నగరం హైదరాబాద్‌తో సహా), మరాఠీ మాట్లాడే మరాఠ్వాడా, కన్నడ మాట్లాడే ప్రాంతం, భారత ఆధిపత్యంలోకి తీసుకురాబడింది.

మా కథనాలు సుసంపన్నంగా ఉంటాయని, భావితరాలకు విలువైనవిగా ఉంటాయని మేము మా పాఠకులకు హామీ ఇస్తున్నాము.

హైదరాబాద్: భారత స్వాతంత్య్రానికి ముందు హైదరాబాద్ రాష్ట్రం బ్రిటీష్ ఇండియా భూభాగంలో ఉండేది. మూడు భాషా ప్రాంతాలతో కూడిన రాచరిక రాష్ట్రంగా ఉంది. తెలుగు మాట్లాడే తెలంగాణ (రాజధాని నగరం హైదరాబాద్‌తో సహా), మరాఠీ మాట్లాడే మరాఠ్వాడా.. కన్నడ మాట్లాడే ప్రజలు ఉన్న కొంచెం ప్రాంతం. ఇందులో ఎనిమిది తెలంగాణ జిల్లాలు, ఐదు మహారాష్ట్ర జిల్లాలు, మూడు కర్ణాటక జిల్లాలు ఉన్నాయి.

పూర్వ హైదరాబాద్ రాష్ట్రంలో భాగమైన జిల్లాలు ఔరంగాబాద్, భీర్, పర్ధాని, ఉస్మానాబాద్ (ప్రస్తుత లాతూర్ జిల్లా ఉస్మానాబాద్ జిల్లాలో భాగం), నాందేడ్, బీదర్, గుల్బర్గా, రాయచూర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ, వరంగల్, బస్తర్. పరిపాలనాపరంగా హైదరాబాద్ రాష్ట్రం నాలుగు విభాగాలుగా విభజించబడింది. 16 జిల్లాలను కలిగి ఉంది. ఔరంగాబాద్, గుల్బర్గా, మెదక్, వరంగల్ నాలుగు డివిజన్లుగా విభజించబడింది.

అప్పట్లో హైదరాబాద్ 82,000 చదరపు మైళ్ల వైశాల్యం.. 16 మిలియన్లకు పైగా జనాభా కలిగి ఉంది. అందులో 2 మిలియన్ల ముస్లింలు, 13 మిలియన్ల హిందువులు, 1 మిలియన్ క్రైస్తవులు ఉన్నారు. 4 మిలియన్ల మరాఠాలు, 2 మిలియన్ల మంది కర్ణాటక వాసులు ఉన్నారు. 1956లో భాషావారీగా భారతీయ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్‌లో విలీనం చేయబడింది. మరాఠీ మాట్లాడే ప్రాంతం బొంబాయి రాష్ట్రంలో (నేటి మహారాష్ట్ర) భాగమైంది, కన్నడ మాట్లాడే ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో భాగమైంది.

1941 హైదరాబాద్ స్టేట్ సెన్సస్ ప్రకారం.. 2,187,005 మంది ఉర్దూ మాతృభాషగా మాట్లాడతారు, 7,529,229 మంది తెలుగు, 3,947,089 మంది మరాఠీ మరియు 1,724,180 మంది కన్నడ మాట్లాడతారు. పాలక అసఫ్ జాహీ రాజవంశంతో సహా హైదరాబాదీ ముస్లిం జనాభా 2,097,475, హిందువులు 9,171,318 మంది ఉండేవారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం 75వ వార్షికోత్సవాన్ని జరుపుకోవాలని కేంద్రం, రాష్ట్రాలు ప్లాన్ చేస్తున్నాయి. ఏడాది పొడవునా వేడుకలను ప్రారంభించాలని బీజేపీ నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా ఏడాది పొడవునా వేడుకలను నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఇక ఆ రోజును జాతీయ సమైక్యతా దినోత్సవంగా పిలవాలని ఎంఐఎం కేంద్రానికి లేఖ రాసింది.

Next Story