Hyderabad: ప్రయాణికులకు అలర్ట్‌.. మ‌ధ్యాహ్నం వేళ ఆర్టీసీ బ‌స్సుల త‌గ్గింపు

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఎండలు మండిపోతున్నాయి. నగరంలో కొనసాగుతున్న వేడిగాలుల కారణంగా నగర రోడ్లపై మధ్యాహ్నం ప్రజల రాకపోకలు తగ్గాయి.

By అంజి  Published on  16 April 2024 2:30 AM GMT
Greater Hyderabad zone, TSRTC, buse , hot summer

Hyderabad: ప్రయాణికులకు అలర్ట్‌.. మ‌ధ్యాహ్నం వేళ ఆర్టీసీ బ‌స్సుల త‌గ్గింపు 

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఎండలు మండిపోతున్నాయి. నగరంలో కొనసాగుతున్న వేడిగాలుల కారణంగా నగర రోడ్లపై మధ్యాహ్నం ప్రజల రాకపోకలు తగ్గాయి. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ జోన్- టిఎస్‌ఆర్‌టిసి మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల మధ్య బస్సు కార్యకలాపాలను తగ్గించాలని నిర్ణయించినట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

"వేసవి, మధ్యాహ్నం రోడ్లపై ప్రజల రాకపోకలు విపరీతంగా పడిపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని, గ్రేటర్ హైదరాబాద్ జోన్-టిఎస్‌ఆర్‌టిసి మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల మధ్య బస్సు కార్యకలాపాలను నిలిపివేస్తుంది" అని టిఎస్‌ఆర్‌టిసి ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రజల సౌకర్యార్థం బుధవారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వీ వెంకటేశ్వరులు అన్ని రూట్లలో ఉదయం 5 గంటల నుంచి ప్రారంభ ట్రిప్పులు, మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్ని రూట్లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీంతో ఉద‌యం, సాయంత్రం వేళ‌లో ప్ర‌యాణికుల‌కు స‌రిప‌డా బ‌స్సులో అందుబాటులో ఉండ‌నున్నాయి. మ‌ధ్యాహ్నం వేళ ప్రయాణం చేసే వారు ఆర్టీసీ నిర్ణ‌యాన్ని గ‌మ‌నించాల‌ని అధికారులు సూచించారు.

Next Story