ఐఏ‌ఎంసీ భవ‌నా‌నికి భూమిపూజ చేసిన సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

CJI NV Ramana lays foundation stone for construction of new building of IAMC.హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలిలో అంత‌ర్జాతీయ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 March 2022 10:45 AM GMT
ఐఏ‌ఎంసీ భవ‌నా‌నికి భూమిపూజ చేసిన సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలిలో అంత‌ర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ భ‌వ‌న నిర్మాణాల‌కు సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ రమణ శ‌నివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జీలు హిమా కోహ్లీ, నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీజే సతీష్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్, మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తది‌త‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో రూపుదిద్దుకుంటున్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ వల్ల హైదరాబాద్‌ ఖ్యాతి మరింతగా పెరుగుతుందన్నారు. భ‌వ‌న నిర్మాణానికి హైటెక్స్‌లోని ఐకియా వెనుక ఉన్న 3.7 ఎక‌రాలు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. నేడు ఈ భవన నిర్మాణానికి భూమిపూజ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దీనికోసం రూ.50 కోట్లు కేటాయించారని సీజేఐ వెల్లడించారు.

ఇప్ప‌టికే హైదరాబాద్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం కొనసాగుతున్నదని చెప్పారు. సింగపూర్‌ మాదిరిగా హైదరాబాద్‌ కేంద్రం కూడా ప్రపంచ ఖ్యాతి పొందాలని ఆకాంక్షించారు. వచ్చే ఏడాది ఈ సమయానికి భవనం పూర్తి కావాలని ఆశించారు. ఆర్బిట్రేషన్‌ మీడియేషన్‌ భవన నిర్మాణానికి సహకరించిన సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు.

Next Story