సినీ నటి మాధవీలతపై కేసు

ప్రముఖ సినీ నటి మాధవీలతపై హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

By -  Medi Samrat
Published on : 29 Dec 2025 7:37 PM IST

సినీ నటి మాధవీలతపై కేసు

ప్రముఖ సినీ నటి మాధవీలతపై హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. షిరిడీ సాయిబాబా దేవుడు కాదంటూ ఆమె సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఫిర్యాదు అందింది. మాధవీలతతో పాటు ఈ వివాదాన్ని ప్రోత్సహించిన పలువురు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.

మాధవీలత ఇటీవల సాయిబాబాను ఉద్దేశించి కొన్ని పోస్టులు పెట్టారు. ఈ వ్యాఖ్యలు సాయిబాబా భక్తుల నమ్మకాలను కించపరిచేలా ఉన్నాయని కొందరు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, మాధవీలతతో పాటు ఆమెకు మద్దతుగా ఇంటర్వ్యూలు చేసి, వీడియోలు ప్రచారం చేసిన వారిపైనా కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నిందితులందరికీ నోటీసులు జారీ చేశారు.

Next Story