Telangana: స్కూల్‌లో 14 ఏళ్ల బాలుడు కుప్పకూలి మృతి

తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ బాయ్స్ యాకుత్‌పురాలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

By అంజి
Published on : 31 Aug 2025 4:21 PM IST

14-year-old boy collapses,  Telangana Minorities Residential School,  Yakutpura

Telangana: స్కూల్‌లో 14 ఏళ్ల బాలుడు కుప్పకూలి మృతి

తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ బాయ్స్ యాకుత్‌పురాలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. బాలుడు మొహమ్మద్ రిజ్వాన్ (14) తన స్కూల్ బ్యాగ్ పెట్టుకోవడానికి స్కూల్‌లోని తన గదికి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. గమనించిన వార్డెన్లు అతన్ని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, అయితే వైద్యులు అతను మృతి చెందినట్లు ప్రకటించారు. అధికారులు పాఠశాలకు చేరుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులు పాఠశాలకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story