ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

By Newsmeter.Network  Published on  31 Dec 2019 3:53 AM GMT
ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

హైదరాబాద్‌: ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లిటిల్‌ ప్లవర్‌ కాలేజీ చౌరస్తాలో స్కూల్‌ విద్యార్థులతో వెళ్తున్న ఆటోను ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మరో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురు విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. హబ్సిగూడ బాష్యం స్కూల్‌కు చెందిన విద్యార్థులు ఆటోలో వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీంతో మృతుల తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.

Hyderabad Road accidennt Hyderabad Road accidennt Hyderabad Road accidennt

Next Story