'భీష్మ' విడుదల అప్పుడే.. ఆ ట్రాక్ హైలైట్ అట !

By Newsmeter.Network  Published on  17 Dec 2019 2:10 PM GMT
భీష్మ విడుదల అప్పుడే.. ఆ ట్రాక్ హైలైట్ అట !

సినిమా ఇండస్ట్రీలో అత్యంత అపనమ్మకమైన పని ఏదైనా ఉందంటే అది డైరెక్షనే. సంవత్సరానికి ఏవరేజ్ గా 190 సినిమాలు రిలీజ్ అయినా హిట్ అయ్యేది నాలుగో ఐయిదో. ఇక ఆ నాలుగైదు హిట్ డైరెక్టర్ లో ఓ కొత్త డైరెక్టర్ ఉండటం అనేది నిజంగా ఆ డైరెక్టర్ అదృష్టమే. అలాంటి అదృష్టవంతుడే 'ఛలో' డైరెక్టర్ వెంకీ కుడుముల. పెద్దగా విషయం లేకపోయినా వెంకీ భారీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం తన డైరెక్షన్ లో నితిన్ హీరోగా రాబోతున్న సినిమా 'భీష్మ'. అయితే ముందుగా ఈ చిత్రాన్ని క్రిష్టమస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజ్ చేయాలని చూసినా ఆ తరువాత రిలీజ్ డేట్ అది కాదు అని ప్రకటించారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం శివరాత్రికి స్పెషల్ గా విడుదల కానుందని తెలుస్తుంది. ఎలాగూ శివరాత్రికి పెద్ద సినిమాలు రిలీజ్ కి ఏవి లేవు.. సో బాక్సాఫీస్ వద్ద భీష్మకి పోటీ కూడా ఉండదు. ఇక ఇటివలే ఈ సినిమా కోసం నితిన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. అయితే మరి కొన్ని సీన్స్ లు బ్యాలెన్స్ ఉన్నాయని తెలుస్తోంది. అవి ఇంకా షూట్ చేయాలట. అన్నట్లు ఈ చిత్రానికి 'సింగిల్ ఫరెవర్' అనేది ఉపశీర్షిక. క్యాప్షన్ ను హీరో క్యారెక్టర్ ఆధారంగా పెట్టారట.

ఇక 'ఛలో' మాదిరిగానే ఈ సినిమాని కూడా వెంకీ ఎంటెర్టైనింగా మలచనున్నాడట. మెయిన్ గా వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమాలో హైలెట్ అవుతుందని సమాచారం. ప్రస్తుతం తెలుగులో ఉన్న యువ కామెడియన్లలో ఎలాంటి ఫన్నీ పాత్రనైనా అవలీలగా చేస్తూ చక్కని హాస్యాన్ని పండించగలగడం వెన్నెల కిశోర్ స్పెషాలిటీ. అందుకే వెన్నెల కిశోర్ కోసం పనిగట్టుకుని మరీ తమ సినిమాల్లో పాత్రలు రాస్తున్నారు దర్శకరచయితలు. 'భీష్మ'లో కూడా వెన్నెల కిశోర్ అలాంటి పాత్రలోనే నటిస్తున్నాడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

Next Story