'కోటి జరిమానా విధిస్తాం': తప్పుడు మెడిసిన్ యాడ్స్‌పై పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక

అల్లోపతి మందులను ఉద్దేశించి తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రచురించినందుకు పతంజలి ఆయుర్వేదంపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.

By అంజి
Published on : 22 Nov 2023 7:00 AM IST

Supreme Court, Patanjali, false medicinal ads, allopathic medicines

'కోటి జరిమానా విధిస్తాం': తప్పుడు మెడిసిన్ యాడ్స్‌పై పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక

అల్లోపతి మందులను ఉద్దేశించి తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రచురించినందుకు పతంజలి ఆయుర్వేదంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర స్థాయిలో మండిపడింది. పతంజలి ఉత్పత్తులు కొన్ని వ్యాధులను నయం చేయగలవని తప్పుడు క్లెయిమ్ చేస్తూ యాడ్స్‌ వేస్తే కోటి రూపాయల జరిమానా విధిస్తామని న్యాయమూర్తులు అహ్సానుద్దీన్ అమానుల్లా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రచురించడాన్ని నిలిపివేయాలని పతంజలి ఆయుర్వేదాన్ని కోర్టు ఆదేశించింది. పతంజలి పత్రికల్లో సాధారణ ప్రకటనలు చేయడం మానుకోవాలని కోర్టు పేర్కొంది.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనలు అల్లోపతిని కించపరిచేలా ఉన్నాయని, కొన్ని వ్యాధులను నయం చేయడం గురించి తప్పుడు వాదనలు చేస్తున్నాయని పిటిషన్ ఆరోపించింది. పతంజలి క్లెయిమ్‌లు ధృవీకరించబడలేదని, డ్రగ్స్ అండ్ అదర్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్, 1954, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, 2019 వంటి చట్టాలను నేరుగా ఉల్లంఘిస్తున్నాయని ఐఎంఏ వాదిస్తోంది. ఈ విషయంలో ఆచరణీయమైన సిఫార్సులతో ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు కోరింది. విచారణను ఫిబ్రవరి 5, 2024కి వాయిదా వేసింది.

Next Story