కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి 'నవరత్నాలు'..
BOOSTING YOUR IMMUNE SYSTEM AGAINST CORONAVIRUS. ఈ ఆహరం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెంపొందుతుంది
By Medi Samrat Published on 3 April 2021 2:25 PM GMT
కరోనా ఈ పేరు ప్రపంచాన్ని గడగడా వణికించింది. కంటికి కనిపించని ఈ వైరస్ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. లక్షల్లో ప్రజలు ఆసుపత్రిబారిన పడుతున్నారు. ఇక ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి ఆహరం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెంపొందుతుంది అనేది ఒక్కసారి చూదాం..
1) నిమ్మకాయ:
రోజు నిమ్మకాయ రసం త్రాగండి. దీనివల్ల విటమిన్ C పెరుగుతుంది.
2) బాదం:
ఒకరోజు ముందు రాత్రి నానబెట్టిన బాదాంను మరుసటి పొద్దున్న తిన్నండి. విటమిన్ E తో పాటు జలుబు నుండి రక్షిస్తుంది.
3) పెరుగు:
రోజు పెరుగును తినండి, తేనే కూడా బాగుంటుంది. ఇది విటమిన్ D తో కూడి వుంటుంది.
4) పసుపు:
మీ వంటలలో పసుపును ఎక్కువగా వాడండి. ఇది ఇమ్యూన్ బూస్టర్.
5) పాలకూర:
ఈ ఆకుకూరల్లో విటమిన్ C దండిగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తిని ఇస్తుంది.
6) అల్లం :
గొంతులో మంటను, వికారాన్ని తగ్గిస్తుంది.
7) వెల్లుల్లి :
ఇది ఒక ఆధ్బుతమైన ఔషధం. రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది.
8) ప్రతిరోజు వాకింగ్ చేయండి :
ఆసనాలు, ప్రాణాయామం చేయండి, మెడిటేషన్ లో కూర్చోండి..
9) ఎండు ద్రాక్ష (కిస్ మిస్) :
ఇందులో జింక్, ఐరన్, ఫైబర్ మరియు B12 విటమిన్ కలిగిన పండు.
పైన వివరించిన పండ్లు, ఆకుకూరలు, ,వంట దినుసులు మీ ఆహరంలో తప్పకుండా తీసుకోండి.దీనివల్ల మీ శరీరం కరోనా వైరస్ తో ధైరంగా పోరాడే శక్తిని ఇవ్వటమే కాదు అసలు మిమ్మల్ని ఏమీ చేయలేదు.