నిద్రలేచాక‌ ఈ స్పెషల్ డ్రింక్ తాగండి.. జిమ్‌కి వెళ్లకుండానే 30 రోజుల్లో జీరో ఫిగర్ మీ సొంతం..!

భారతీయుల‌ వంటగదుల‌లో ఆహారం రుచిని పెంచే అనేక మసాలా దినుసులు ఉంటాయి.

By Medi Samrat
Published on : 21 March 2025 10:52 AM IST

నిద్రలేచాక‌ ఈ స్పెషల్ డ్రింక్ తాగండి.. జిమ్‌కి వెళ్లకుండానే 30 రోజుల్లో జీరో ఫిగర్ మీ సొంతం..!

భారతీయుల‌ వంటగదుల‌లో ఆహారం రుచిని పెంచే అనేక మసాలా దినుసులు ఉంటాయి. అదనంగా అవి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. ఆ సుగంధ ద్రవ్యాలలో జీలకర్ర కూడా ఒకటి. జీలకర్రను ఆహారంలో కలిపితే రుచి రెట్టింపు అవుతుంది. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలియకపోవచ్చు. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

జీలకర్రను నిమ్మకాయ, చిటికెడు ఉప్పును నీటిలో కలిపి తాగితే దాని ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. ఈ నీరు శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ రోజు మనం జీల‌క‌ర్ర ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం..

జీర్ణశక్తి మెరుగుకు..

జీలకర్రలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇందులో నిమ్మ, ఉప్పు కలిపి తీసుకుంటే ఎసిడిటీ, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ ఈ డ్రింక్ తాగడం వల్ల ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. అలాగే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

రోగనిరోధక శక్తికి..

నిమ్మకాయలో మంచి మొత్తంలో విటమిన్ సి లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. జీలకర్రను నిమ్మ‌ నీటిలో కలిపి సేవిస్తే జలుబు, దగ్గు వంటి సాధారణ వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులో చిటికెడు ఉప్పు కలిపితే దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఈ మిశ్రమం శరీరానికి సహజ రక్షణ కవచంగా పనిచేస్తుంది. రోజూ ఈ డ్రింక్ తీసుకుంటే మీలో ఎనర్జీ అలాగే ఉంటుంది.

బరువు తగ్గడానికి..

మీరు త్వరగా బరువు తగ్గాలంటే నిమ్మ, ఉప్పు కలిపిన జీలకర్ర నీటిని తాగండి. ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తాగండి. ఈ పానీయం జీవక్రియను వేగవంతం చేయడానికి పనిచేస్తుంది. దీంతో శరీరంలో క్యాలరీలు వేగంగా కరిగిపోతాయి. శరీరం నుండి విషాన్ని తొలగించడంలో నిమ్మకాయ సహాయపడుతుంది. అదే సమయంలో ఉప్పు శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహిస్తుంది.

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది..

జీలకర్ర నీళ్లలో నిమ్మ, ఉప్పు కలిపి తాగితే శరీరంలో నీటి కొరత ఉండదు. వేసవి కాలంలో డీహైడ్రేషన్ సమస్య తరచుగా వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఇది మంచి ఎంపిక. మీరు వ్యాయామం చేసిన తర్వాత కూడా ఈ పానీయం తీసుకోవచ్చు. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్ తక్షణ శక్తిని ఇస్తాయి, దీని వల్ల అలసట అనిపించదు.

రక్తపోటును నియంత్రిస్తుంది..

అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి ఈ పానీయం ప్రయోజనకరంగా ఉంటుంది. జీలకర్ర, నిమ్మకాయలు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఉప్పు శరీరంలో సోడియం బ్యాలెన్స్‌ను నిర్వహిస్తుంది. ఇది బీపీని అదుపులో ఉంచుతుంది.

చర్మానికి మేలు..

జీలకర్ర నీళ్లలో నిమ్మ, ఉప్పు కలిపి తాగితే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఇది జుట్టును కూడా బలపరుస్తుంది. నిమ్మరసం డిటాక్సిఫికేషన్‌లో సహాయపడుతుంది.. చర్మం శుభ్రంగా.. మెరుస్తూ ఉంటుంది.

పానీయం ఇలా చేయండి..

ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే వడపోసి కాస్త గోరువెచ్చగా చేసుకోవాలి. దానికి చిటికెడు రాతి ఉప్పు, 1 టీస్పూన్ నిమ్మరసం కలపండి. బాగా కలిపాక‌ ఖాళీ కడుపుతో త్రాగాలి.

Next Story