ఇంటర్ విద్యార్థులకు సర్కార్ గుడ్న్యూస్
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 Nov 2020 10:42 AM GMT
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త వినిపించింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షలకు హాజరుకాని 27,589 మంది విద్యార్థులను గ్రేస్ మార్కులతో పాస్ చేయాలని నిర్ణయం తీసుకుంది. వీరిలో మాల్ ప్రాక్టీస్ కమిటీ బహిష్కరించిన 338 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించకుండా గ్రేస్ మార్కులతో పాస్ చేసిన విషయం తెలిసిందే.
Also Read
ప్రశాంతంగా దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్Next Story