శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ లో భారీగా బంగారం పట్టివేత

By Newsmeter.Network  Published on  24 Jan 2020 1:58 PM GMT
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్‌ లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.1.6కోట్లు ఉంటుందని అంచనా. దుబాయ్‌, మస్కట్‌, సౌదీ అరేబియా నుంచి వచ్చిన ప్రయాణీకుల నుంచి దాదాపు 4 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుండి 800గ్రాములు, మస్కట్‌ నుండి వచ్చిన ప్యాసింజర్‌ నుంచి 700గ్రాములు, సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఇద్దరి నుంచి కేజీన్నరకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతోనే నలుగురు ప్రయాణీకుల్ని తనిఖీ చేసి బంగారాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

Next Story