విండీస్‌తో ఆఖ‌రి వ‌న్డే నేడే.. టాస్ గెలిచిన భార‌త్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Dec 2019 8:04 AM GMT
విండీస్‌తో ఆఖ‌రి వ‌న్డే నేడే.. టాస్ గెలిచిన భార‌త్‌

వెస్టిండీస్‌తో జరుగుతున్న‌ మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఒక్క మార్పు మిన‌హా రెండో వ‌న్డేలో ఆడిన జ‌ట్టుతోనే టీమిండియా బ‌రిలోకి దిగుతుంది. వెన్ను నొప్పితో బాధపడుతున్న దీపక్ చాహర్ స్థానంలో నవదీప్ సైనీకి ఈ వ‌న్డేలో చోటు క‌ల్పించారు. నవదీప్‌కిది తొలి అంతర్జాతీయ వన్డే.

ప్ర‌స్తుత సిరీస్‌లో విండీస్‌తో 1-1తో సమంగా ఉన్న భారత్‌.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవ‌సం చేసుకోవాల‌నే ఊపు మీదుంది. అలాగే విండీస్ కూడా ఈ మ్యాచ్ లో గెలిచి ఎలాగైనా సిరీస్‌తో ప‌య‌న‌మ‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో బ‌రిలోకి దిగుతుంది.

Next Story