FactCheck : పాకిస్తాన్‌పై శ్రీలంక విజయం సాధించినందుకు కశ్మీర్ ప్రజలు సంబరాలు చేసుకున్నారా?

ఆసియా కప్ 2023 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై శ్రీలంక విజయం సాధించినందుకు కశ్మీర్ ప్రజలు సంబరాలు జరుపుకున్నారంటూ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Sep 2023 3:51 PM GMT
FactCheck : పాకిస్తాన్‌పై శ్రీలంక విజయం సాధించినందుకు కశ్మీర్ ప్రజలు సంబరాలు చేసుకున్నారా?

ఆసియా కప్ 2023 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై శ్రీలంక విజయం సాధించినందుకు కశ్మీర్ ప్రజలు సంబరాలు జరుపుకున్నారంటూ సోషల్ మీడియా వినియోగదారులు పోస్టులు పెడుతున్నారు. ఎంతో మంది ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.


‘పాకిస్థాన్‌పై శ్రీలంక విజయం సాధించిన తర్వాత కశ్మీర్‌కు చెందిన వీడియో ఇది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజలు బయటకు వచ్చారు'.

నిజ నిర్ధారణ :

NewsMeter బృందం వైరల్ వీడియోను ప్రజలు తప్పుదోవ పట్టించేదిగా గుర్తించింది

మేము వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. సెప్టెంబర్ 9, 2023 నాటి వర్గీకరణ వెబ్‌సైట్‌లో ‘J&K celebrates India win. Fans burst crackers in J&K after the Ind vs Pak match’ అనే ట్యాగ్‌ల క్రింద స్క్రీన్‌ షాట్ ను కనుగొన్నాము. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ తర్వాత అభిమానులు జమ్మూ కశ్మీర్లో క్రాకర్స్ పేల్చారు. పాకిస్థాన్ శ్రీలంక మ్యాచ్ సెప్టెంబర్ 14, 2023న జరిగింది.


దీని నుండి క్యూ తీసుకొని, మేము Googleలో సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. వైరల్ వీడియోకు సంబంధించిన అనేక లింక్‌లను కనుగొన్నాము.

లింక్‌లలో ఒకటి మమ్మల్ని రిపబ్లిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానెల్‌కి దారితీసింది. అదే వీడియో సెప్టెంబర్ 12, 2023న అప్‌లోడ్ చేశారు. వీడియో వివరణలో 'జమ్మూ కశ్మీర్‌లో, భారత క్రికెట్ జట్టు అభిమానులు భారతదేశం అద్భుతమైన విజయంతో సంబరాల్లో మునిగిపోయారు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించగానే.. అభిమానులు సెంట్రల్ జమ్మూ ప్రధాన కూడలిపైకి దూసుకెళ్లారు, భారతీయ జెండాలను ఊపుతూ, చప్పట్లతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.' అంటూ అందులో ఉంది.


సెప్టెంబర్ 11, 2023 నాడు JK Media యూట్యూబ్ ఛానెల్ లో 'ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత జమ్మూలో వేడుకలు' అనే శీర్షికతో అదే వీడియోను కనుగొన్నాము.


అందువల్ల, పాకిస్థాన్ పై శ్రీలంక విజయం సాధించడంతో జమ్మూ కశ్మీర్ ప్రజలు సంబరాలు జరుపుకున్నారనే వాదన తప్పుదోవ పట్టించేదని మేము నిర్ధారించాము. వైరల్ వీడియో సెప్టెంబర్ 10, 2023న జరిగిన ఆసియా కప్ 2023 మ్యాచ్‌ కు సంబంధించినదని తెలిసింది. పాకిస్తాన్‌ను భారత్ ఓడించిన తర్వాత జమ్మూలో ఈ వేడుకలు జరిగాయి.

Credits : Abrar Bhat

Claim Review:పాకిస్తాన్‌పై శ్రీలంక విజయం సాధించినందుకు కశ్మీర్ ప్రజలు సంబరాలు చేసుకున్నారా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter
Claim Fact Check:False
Next Story