యూనివర్సిటీలకు పాలకమండళ్లు.. విద్యాశాఖ ఉత్తర్వులు
By అంజి Published on 29 Feb 2020 4:27 AM GMTహైదరాబాద్: రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలకు ప్రభుత్వం కొత్త ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను నియమించింది. ఉస్మానియా, జేఎన్టీయూ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మగాంధీ, జేఎన్ఏఎఫ్యూ యూనివర్సిటీలకు కొత్త పాలక మండళ్లను నియమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటలో విద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ పాలక మండళ్లను నియమించింది. రెండు, మూడు వారాల్లో యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్స్లర్లను నియమించాలని ఈ నెల 19న సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఒక్కో పాలకమండలిలో తొమ్మిది సభ్యులు ఉంటారు. విద్యావేత్తలు, సామాజిక వేత్తలు, పారిశ్రామిక వేత్తలు, విశిష్ట వ్యక్తుల కింద నలుగురికి ఈ కౌన్సిల్లో స్థానం కల్పించారు.
అప్పట్లో పాలక మండళ్లు లేకపోవడంతో.. వైస్ ఛాన్స్లర్ల నియమాకానికి ప్రభుత్వం గత జులైలోనే అన్వేషణ కమిటీలను నియమించింది. దీంతో ఐఏఎస్ అధికారులతో కూడిన పర్యవేక్షణ, అభివృద్ధి కమిటీలే నామినీని ప్రతిపాదించాయి. ఈ నేపథ్యంలోనే పాలక మండళ్లను విద్యాశాఖ నియమించింది. నామినీ పేర్లను పాలకమండళ్లు ఆమోదించి పంపకుంటే న్యాయపరమైన సమస్యలు వస్తాయని.. ముందుగానే పసిగట్టిన ప్రభుత్వం పాలకమండళ్లను నియమించింది. కాగా వీసీల నియమాకానికి మరో మూడు వారాల సమయం పడుతుందని అంచనా..