వ్యూహం కూడా థియేటర్లలోకి వచ్చేస్తోంది.. చూసేందుకు సిద్ధమా.?

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో పొలిటికల్ సినిమాలు కూడా విడుదల అవుతూ ఉన్నాయి.

By Medi Samrat  Published on  8 Feb 2024 1:15 PM GMT
వ్యూహం కూడా థియేటర్లలోకి వచ్చేస్తోంది.. చూసేందుకు సిద్ధమా.?

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో పొలిటికల్ సినిమాలు కూడా విడుదల అవుతూ ఉన్నాయి. ఫిబ్రవరి 8న యాత్ర-2 సినిమా విడుదలవ్వగా.. ఎన్నో రోజులుగా విడుదలకు ఆటంకాలు ఎదుర్కొంటూ ఉన్న వ్యూహం సినిమా కూడా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా విడుదలకు లైన్‌ క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది. హైకోర్టు సూచనలతో రెండోసారి కూడా సెన్సార్‌ బోర్డు వ్యూహం సినిమాకు క్లియెరెన్స్‌ ఇచ్చింది. దీంతో ఈ చిత్రానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. వ్యూహం చిత్రాన్ని ఫిబ్రవరి 16న విడుదల చేస్తున్నట్లు నిర్మాత దాసరి కిరణ్‌ తెలిపారు.

గతంలోనే వ్యూహం సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కానీ సినిమా విడుదలను ఆపాలని తెలంగాణ హైకోర్టులో టీడీపీ నేత నారా లోకేష్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. లోకేష్‌ పిటిషన్‌తో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి సినిమా విడుదలను తాత్కాలికంగా ఆపింది.. వ్యూహం సినిమాను మరొకసారి సమీక్షించి ఒక కమిటీని ఏర్పాటు చేసి సెన్సార్‌ ఇవ్వాలని కోర్టు ఆదేశాలను ఇచ్చింది.కోర్టు నిర్ణయంతో మరోసారి వ్యూహం చిత్రానికి తాజాగా సెన్సార్‌ నిర్వహించారు. చిత్రాన్ని విడుదల చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని సెన్సార్‌ బోర్డు తెలిపింది. దీంతో వ్యూహం చిత్రం ఫిబ్రవరి 16న విడుదల కానుంది.

Next Story