విలక్షణ దర్శకుడు మణిరత్నం తన తదుపరి ప్రాజెక్ట్ను ఇద్దరు అద్భుతమైన నటులతో ప్లాన్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ క్రేజీ మూవీపై అధికారిక ప్రకటన వెలువడింది. కమల్ హాసన్తో మణిరత్నం తీసిన 'థగ్ లైఫ్' ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఈ కొత్త చిత్రం పట్టాలెక్కుతోంది.
మద్రాస్ టాకీస్ బ్యానర్పై రూపొందనున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. గత మూడు దశాబ్దాలుగా మణిరత్నం తన ప్రతి సినిమాకు రెహమాన్తోనే కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, మ్యూజిక్ డైరెక్టర్గా సాయి అభ్యంకర్ను తీసుకుంటున్నారనే వార్తల్లో వాస్తవం లేదని స్పష్టమైంది.
ప్రస్తుతం విజయ్ సేతుపతి, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో 'స్లమ్డాగ్ - 33 టెంపుల్ రోడ్' అనే సినిమాలో నటిస్తుండగా, సాయి పల్లవి రణబీర్ కపూర్ సరసన 'రామాయణం' చిత్రంలో బిజీగా ఉంది. ఈ ఇద్దరు టాలెంటెడ్ నటులు మణిరత్నం ఫ్రేమ్స్లో ఎలా కనిపిస్తారో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.