మళ్లీ ఆస్పత్రిలో చేరిన సమంత.. టెన్షన్‌ పడుతున్న ఫ్యాన్స్‌!

సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌ సమంత రూత్ ప్రభుకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన ఆరోగ్యం గురించి అప్‌డేట్‌ను పంచుకుంది.

By అంజి  Published on  13 Oct 2023 6:23 AM GMT
samantha, Myositis, samantha fans,South Cinema

మళ్లీ ఆస్పత్రిలో చేరిన సమంత.. టెన్షన్‌ పడుతున్న ఫ్యాన్స్‌!

సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌ సమంత రూత్ ప్రభుకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. విరామంలో ఉన్నారు. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన ఆరోగ్యం గురించి అప్‌డేట్‌ను పంచుకుంది. సమంత తన చేతికి సెలైన్‌ పైపుతో ఆసుపత్రి బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌తో సమంత ఆసుపత్రిలో చేరిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదని తెలుస్తోంది. ఆమె స్వయం ప్రతిరక్షక ఆరోగ్య పరిస్థితి అయిన మయోసిటిస్‌కు చికిత్స పొందుతున్నందున, మందులు ఆమె కోలుకోవడానికి ఎలా సహాయపడుతున్నాయో కూడా సమంత వివరించింది.

తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సమంతా హైదరాబాద్‌లోని డిజైర్ ఈస్తటిక్స్ అనే స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌ని ట్యాగ్ చేసింది. మందుల వల్ల తనకు కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తూ.. ఆ ఫొటోపై రాసుకొచ్చింది. తనకు ఈ డ్రిప్సే రోగ నిరోధక శక్తిని అందిస్తాయని తెలిపింది. రక్త కణాల ఉత్పత్తి, రోగ నిరోధక శక్తి పెరుగుదల, హృదయ సంరక్షణ, కండరాల శక్తి, వైరస్ లకు వ్యతిరేకంగా పోరాడే శక్తి, హృదయానికి రక్త సరఫరా, ఎముకల బలహీనత పోగొట్టేందుకు ఉపయోగపడాయంటూ వెల్లడించింది. తాను షేర్ చేస్తున్న ఈ పోస్టు చూసి అభిమానులు కంగారు పడొద్దని కూడా వివరించింది.

మంచి ఆరోగ్యం కోసమే ఇలా సెలైన్ ఎక్కించుకుంటున్నట్లు ఇన్ స్టాగ్రామ్ వేదికగా సమంత చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన సమంత అభిమానులు అంతా టెన్షన్ పడుతున్నారు. సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే మీ ఆరోగ్యం బాగవుతుందని చెబుతూ.. సామ్‌కు ధైర్యం చెబుతున్నారు. కుషి' విడుదలైన తర్వాత, సమంత తన ఆరోగ్యంపై దృష్టి సారించింది. వివిధ ప్రాంతాలకు అనేక పర్యటనలు చేసింది. ఆమె తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు.

Next Story