ఉక్రెయిన్‌లో ల్యాండ్ అయిన 'ఆర్ఆర్ఆర్' చిత్ర‌బృందం

RRR team going to Ukraine.ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Aug 2021 6:06 AM GMT
ఉక్రెయిన్‌లో ల్యాండ్ అయిన ఆర్ఆర్ఆర్ చిత్ర‌బృందం

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం). యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌డంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో.. రెండు పాట‌లు మినహా చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్తి అయ్యింద‌ని ఇటీవ‌ల చిత్ర‌బృందం వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మిగిలిన భాగాన్ని పూర్తి చేసేందుకు ఆర్ఆర్ఆర్ బృందం మంగ‌ళ‌వారం ఉక్రెయిన్ కు వెళ్లింది. ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తే.. చిత్ర‌బృందం విమాన ప్ర‌యాణ వీడియోను షేర్ చేసింది. ఆఖ‌రి షెడ్యుల్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఉక్రెయిన్‌లో ల్యాండ్ అయింది అని తెలిపింది.

దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్‌, కొమురం భీమ్‌గా తార‌క్ న‌టిస్తున్నారు. అలియాభ‌ట్, ఒలీవియా మోరీస్, రేయ్ స్టీవ్‌స‌న్‌, శ్రియ‌, అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పిరియాడిక‌ల్ డ్రామాగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story