'మా' ఎన్నికల సమయంలో పృథ్వీ ఫోన్ కాల్ వైరల్..!

Prudhvi Raj Phone Call about MAA Association.మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Oct 2021 10:44 AM GMT
మా ఎన్నికల సమయంలో పృథ్వీ ఫోన్ కాల్ వైరల్..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో థర్టీ ఇయర్స్ పృథ్వీ ఫోన్ కాల్ వైరల్ అవుతోంది. అక్టోబర్ 10న జరగబోతున్న ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు , విష్ణు మంచు ప్యానెల్‌కు మాంచి పోటీ నెలకొంది. రెండు ప్యానెల్స్ గెలుపుకోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మంచు విష్ణు ప్యానెల్‌లో పోటీ చేస్తున్నారు థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ. తాజాగా 'మా' ఎన్నిక‌ల‌కు సంబంధించి ఓటు అడిగే సంద‌ర్భంలో మాట్లాడిన ఆడియో కాల్ లీక‌య్యింది.

''నేను చ‌దువుకుందంతా వైజాగ్‌లోనే, నా తొలి సినిమా షూటింగ్ కూడా వైజాగ్‌లోనే జ‌రిగింది. మీరంటే నాకిష్టం. న‌టుడిగా మీగురించి చాలా మంది చెప్పారు. అయితే ప్ర‌కాశ్‌రాజ్‌గారికి మీరు స‌న్మానం చేయ‌డం మాకు చాలా బాధ‌గా అనిపించింది. ఎందుకంటే.. నేను ఇండ‌స్ట్రీలో ముప్పై ఏళ్లుగా ఉంటున్నాను. పాతికేళ్లుగా ఓసారి కూడా ఓటు వేయ‌ని వ్య‌క్తి ప్ర‌కాశ్‌రాజ్‌. కోవిడ్ స‌మ‌యంలో అంద‌రం ఇక్క‌డ చచ్చాం. చాలా ఇబ్బందులు ప‌డ్డాం. ఈ నామినేష‌న్ వేయ‌డానికి నేను కూడా త‌మిళ‌నాడు మూవీ అసోసియేష‌న్‌కు రిజైన్ చేశాను. కోవిడ్‌లో ఎంతో స‌ర్వీస్ చేశాం. కానీ ఇత‌ను(ప్ర‌కాశ్‌రాజ్‌) ఎక్క‌డి నుంచో ఇప్పుడు వ‌చ్చాడు. ఏం తెలుగువాళ్లెవ్వ‌రూ ప్రెసిడెంట్ కాకూడ‌దా. విష్ణుగాడెవ‌డు.. మీరే గెలుస్తార‌ని తంబ్ నెయిల్ పెట్టించారు మీరు. అది టాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుంది. తెలుగు ఇండ‌స్ట్రీ పైకి రాక‌పోవ‌డానికి కార‌ణ‌మేంటంటే, ప‌క్క‌డోచ్చి మ‌నల్ని తొక్కుతున్నా, పట్టించుకోం. హ్యాపీగా ఉంటాం. అత‌న్ని మీరెలా గెల‌వాల‌ని కోరుకున్నారు. అత‌న్ని ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ అసోసియేష‌న్ రెండుసార్లు స‌స్పెండ్ చేసింది. నేను క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి యాక్ట్ చేయ‌డానికి వెళ్లి లేడీ గెట‌ప్ వేస్తే.. నా విగ్గు లాగేశారు. క‌న్న‌డ‌వాళ్లే యాక్ట్ చేయాలంటే, సిగ్గుతో త‌ల‌వంచుకుని వ‌చ్చేశాను. చెన్నైలో అయితే వాళ్ల బిల్డింగ్‌ను వాళ్లే క‌ట్టుకున్నారు. భార‌త‌దేశంలో ఎవ‌డ‌న్నా, ఎక్క‌డ‌నుంచైనా పోటీ చేయ‌వ‌చ్చు కానీ.. ప‌రిపాలించ‌కూడ‌దు. ఏం విశాఖ‌ప‌ట్నంలో, రాజ‌మండ్రిలో, హైద‌రాబాద్‌లో మ‌గాడు లేడా? అని రేపు అంటారు. తెలుగోళ్లు లేరా? మ‌ధ్య‌లో మీరొచ్చి స‌న్మానం చేయ‌డం మీ విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నా. మ‌న తెలుగు రాష్ట్రం కోసం పాటుప‌డ్డ త్యాగ‌మూర్తులెంద‌రో ఉన్నారు. తెలంగాణ నుంచి మ‌నల్ని ఎత్తి కొట్టారు. 1952 నుంచి మా నాన్న మ‌ల్రెడ్డి సుబ్బారావుగారు ఇండ‌స్ట్రీలోనే ఉన్నారు. శ్రీకృష్ణావ‌తారంలో మానాన్న‌గారు క‌ర్ణుడిగా న‌టించారు. ఇండ‌స్ట్రీలో పుట్టిన పెరిగినోళ్లం. మాకు తెలుసు. ఆలోచించండి'' అన్నారు.

మంచు విష్ణు ప్యానెల్ నుంచి వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న నటుడు పృథ్వీ రాజ్ బెదిరింపులకు దిగడం చర్చనీయాంశమైంది. ఒక మా సభ్యుడిని ఫోన్ లో బెదిరించడం..దీనికి సంబంధించిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Next Story