ఇక అక్కడ రివ్యూలు ఇవ్వడం కుదరదు..!

ఇండియన్ 2, వేట్టైయాన్, కంగువ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను ప్రభావితం చేసిన పబ్లిక్ రివ్యూల సమస్యను పరిష్కరించడానికి కోలీవుడ్ చిత్ర పరిశ్రమ కీలక చర్యలు తీసుకుంది.

By Medi Samrat
Published on : 20 Nov 2024 6:30 PM IST

ఇక అక్కడ రివ్యూలు ఇవ్వడం కుదరదు..!

ఇండియన్ 2, వేట్టైయాన్, కంగువ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను ప్రభావితం చేసిన పబ్లిక్ రివ్యూల సమస్యను పరిష్కరించడానికి కోలీవుడ్ చిత్ర పరిశ్రమ కీలక చర్యలు తీసుకుంది. సినిమా ప్రదర్శన ముగిసిన వెంటనే థియేటర్ల వద్ద సమీక్షలు నిర్వహించకుండా మీడియాను నియంత్రించాలని తమిళనాడు నిర్మాతల మండలి ఇటీవలే థియేటర్ల యజమానులను కోరుతూ ఆదేశాలు జారీ చేసింది. విమర్శల ముసుగులో సినీ నిర్మాతలు, నటీనటులపై వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయని మండలి ఖండించింది.

సినిమా మెరిట్‌లపై దృష్టి సారించే నిర్మాణాత్మక సమీక్షల అవసరం ఉందని చెప్పారు. ఆరోగ్యకరమైన సమీక్షించే సంస్కృతిని ప్రచారం చేస్తూనే చిత్రనిర్మాతల సృజనాత్మక ప్రయత్నాలను, పెట్టుబడులను రక్షించడం లక్ష్యమని చిత్ర నిర్మాతల మండలి భావిస్తోంది.

అయితే థియేటర్లలో సమీక్షలను నిషేధించడం ఈ సమస్యను పరిష్కరించదని మరికొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు. డిజిటల్ మీడియా యుగంలో, సమీక్షలను పూర్తిగా అరికట్టడం ఆచరణ సాధ్యం కాదన్నారు. సినిమా ఎదుగుదలకు నిర్మాణాత్మక విమర్శలు చాలా అవసరం, అయితే అది గౌరవప్రదంగా ఉండాలన్నారు.

Next Story