విషాదం.. క్యాన్స‌ర్‌తో బుల్లితెర న‌టి క‌న్నుమూత‌

Odia tele actress Rajeswari Ray Mohapatra dies.సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ ఒడియా బుల్లితెర న‌టి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 July 2022 12:57 PM IST
విషాదం.. క్యాన్స‌ర్‌తో బుల్లితెర న‌టి క‌న్నుమూత‌

సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ ఒడియా బుల్లితెర న‌టి రాజేశ్వ‌రి రే మోహ‌పాత్ర క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా ఆమె మెద‌డు, ఊరిపితిత్తుల క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతుండ‌గా భ‌వ‌నేశ్వ‌ర్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్ర‌మంలో ప‌రిస్థితి విష‌మించ‌డంతో బుధ‌వారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి ప‌ట్ల సినీ ప్ర‌ముఖులు,అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలియ‌జేస్తున్నారు.

'స్వాభిమానం' అనే ఒడియా సీరియల్‌తో మహాపాత్ర మంచి గుర్తింపు పొందారు. కాగా 2019లో తాను క్యాన్సర్‌తో పోరాడుతున్నానంటూ రాజేశ్వరీ రే ఫేస్‌బుక్‌లో ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేశారు. దీంతో తను త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఆమె ఫ్యాన్స్‌ ప్రార్థించారు.

Next Story