ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మంచు మోహన్ బాబు, ఆయన ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్లపై తిరుపతి కోర్టులో ఓ కేసు విచారణ సాగుతోంది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ మోహన్ బాబు తన ఇద్దరు కుమారులతో కలిసి ధన్నాకు దిగారు. ఈ వ్యవహారంపై మోహన్ బాబు, ఆయన ఇద్దరు కుమారులపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ తిరుపతి కోర్టులో సాగుతోంది. ఈ విచారణను నిలుపుదల చేయాలంటూ మోహన్ బాబు ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు తిరుపతి కోర్టులో కేసు విచారణను 8 వారాల పాటు నిలుపుదల చేసింది.