ప్రముఖ సినీ నిర్మాతపై నటి సంచలన ఆరోపణలు.. తనపై అక్కడ చేయి వేశాడని..
ప్రముఖ సినీ నిర్మాతపై బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రా సంచలన ఆరోపణలు చేసింది. మలయాళ ప్రముఖ సినీ నిర్మాత రంజిత్ తనతో దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది.
By అంజి
ప్రముఖ సినీ నిర్మాతపై నటి సంచలన ఆరోపణలు.. తనపై అక్కడ చేయి వేశాడని..
ప్రముఖ సినీ నిర్మాతపై బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రా సంచలన ఆరోపణలు చేసింది. మలయాళ ప్రముఖ సినీ నిర్మాత రంజిత్ తనతో దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఈ క్రమంలోనే రంజిత్ ఆదివారం నాడు కేరళ చలనచిత్ర అకాడమీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. రంజిత్ తన నిర్ణయాన్ని సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సాజీ చెరియన్కు తెలియజేశారు, తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తాను పదవిలో కొనసాగడానికి ఇష్టపడటం లేదని సమాచారం.
2009లో ఒక ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకు రంజిత్ తన నివాసానికి ఆహ్వానించబడినప్పుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని మిత్రా మీడియాకు వెల్లడించింది. అతను "సూక్ష్మంగా నా దగ్గరకు రావడం" తర్వాత తనకు అసౌకర్యంగా అనిపించిందని చెప్పారు. తన చేతి గాజులని తాకారని.. ఆ తర్వాత మెడపై చేయి వేశారని ఆమె ఆరోపించింది. మరుసటి రోజు తాను కేరళను విడిచిపెట్టానని చెప్పింది. 'పాలేరి మాణిక్యం' సినిమా కోసం ఆడిషన్కు మిత్రను పిలిచారని, అయితే ఆ పాత్రకు ఆమె సరిపోదని నిర్ణయించి ఆమెను వెనక్కి పంపారని వివరించిన రంజిత్ ఆరోపణలను ఖండించారు.
రంజిత్ అకాడమీకి రాజీనామా చేయాలని కేరళ ప్రతిపక్ష నేత వీడిసతీషన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె.సుధాకరన్ డిమాండ్ చేశారు. రంజిత్ రాజీనామా చేయాలని లెఫ్ట్ ఫ్రంట్ కూటమి భాగస్వామ్య కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) పిలుపునిచ్చిందని, రంజిత్ రాజీనామా చేయకుంటే సీపీఐ యువజన సంఘం, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (ఏఐవైఎఫ్) సోమవారం కేరళ చలచిత్ర అకాడమీ ఎదుట నిరసన కవాతు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మలయాళ సినీ నటులు అనూప్ చంద్రన్, జయన్ చేరాల కూడా రంజిత్ రాజీనామాకు పిలుపునిచ్చారు.