విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి

సినీ ఇండస్ట్రీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. నటుడు కుందర జానీ గుండెపోటు రావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

By అంజి  Published on  18 Oct 2023 4:52 AM GMT
Malayalam actor, Kundara Johny, cardiac, Film industry

విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి

సినీ ఇండస్ట్రీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. మలయాళ నటుడు కుందర జానీ మంగళవారం (అక్టోబర్ 17) కొల్లంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయస్సు 71 ఏళ్లు. నివేదికల ప్రకారం.. నటుడు జానీకి గుండెపోటు వచ్చింది, ఆ తర్వాత అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. అతని చివరి చిత్రం 'మెప్పడియాన్', ఇది 2022లో విడుదలైంది. అభిమానులు సోషల్ మీడియాలో జానీకి సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

కుందర జానీ మలయాళ సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలు పోషించి కీర్తిని సంపాదించిన ప్రముఖ కళాకారులలో ఒకరు. అక్టోబర్ 17న గుండెపోటు రావడంతో జానీని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని అంత్యక్రియలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కుందర జానీ అనేక గుర్తింపు లేని పాత్రలతో మలయాళ సినిమాల్లో తన కెరీర్‌ను ప్రారంభించాడు. అతను 1979లో తన 20వ ఏట అరంగేట్రం చేశాడు. 'అగ్నిపర్వతం', 'నిత్య వసంతం', 'రాజావింటే మకన్', 'ఆవనాజి'లో అతని పాత్రలు అతనికి గుర్తింపు తెచ్చాయి. అయినప్పటికీ అతని ప్రతినాయక పాత్రలే అతనికి కీర్తిని తెచ్చిపెట్టాయి. 'నాడోడిక్కట్టు'లో నంబియార్‌ పాత్రలో ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది. అతను 'ఒరు సీబీఐ డైరీ కురిప్పు', 'కిరీడం', 'చెంకోల్' , 'స్పదికం' మొదలైన వాటిలో కూడా నటించాడు.

ఇదిలా ఉంటే.. ఇటీవలే ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు జి మరిముత్తు 58 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. సెప్టెంబర్ 8న ఉదయం 8.30 గంటల ప్రాంతంలో 'ఎతిర్ నీచల్' అనే తన టెలివిజన్ షోకి డబ్బింగ్ చెబుతూ కుప్పకూలిపోయారు. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అతను చనిపోయినట్లు ప్రకటించారు. మరిముత్తు.. చివరిసారిగా రజనీకాంత్ 'జైలర్' , 'ఎర్ర చందనం' చిత్రాలలో పెద్ద తెరపై కనిపించాడు.

Next Story